E-Paper
Advertisement

Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

Gautam Gambhir:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో గ్రూప్ స్టేజిలో దూకుడుగా ఆడింది టీమిండియా ( indian team ). ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయితే సూపర్ 8 స్టేజ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. మొట్ట మొదటి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లడం గగనంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ప్లేయర్ లందరికీ క్లాస్ పీకాడట గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ). అమ్మాయిలపై ఉన్న ఫోకస్.. క్రికెట్ పైన పెట్టడం లేదని కొంత మంది క్రికెటర్లను ఉద్దేశించి నిప్పులు చెరిగినట్లు చెబుతున్నారు. టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను ( Hardik Pandya) ఉద్దేశించి గౌతమ్ గంభీర్ సీరియస్ అయినట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. 

సూపర్ 8 స్టేజ్ లో టీమిండియా వైఫల్యాలు బయటపడ్డాయి. గ్రూప్ స్టేజ్ లో ఎగిరెగిరి పడ్డ టీమిండియా ప్లేయర్లు, దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం చేతులు ముడుచుకొని కూర్చున్నారు. టీమిండియా ఓడిపోతున్నప్పటికీ, ఏ ఒక్కడు సరిగ్గా ఆడలేదు. అయితే ఈ అంశంపై తాజాగా గౌతం గంభీర్ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. టీమిండియా ప్లేయర్లకు డ్రెస్సింగ్ రూమ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు గౌతమ్ గంభీర్. జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పైన కచ్చితంగా గెలవాలని దిశా నిర్దేశం చేశాడు గౌతమ్ గంభీర్.

ఇండియా గౌరవం కాపాడేందుకు ప్రాణాలైనా ఇవ్వాలని హితోపదేశం చేశాడు గౌతమ్ గంభీర్. టీమిండియా టైటిల్ గెలవడం దేశానికి ఎంత ముఖ్యమో స్పష్టంగా వివరిస్తూ క్లాస్ పీకాడని జాతీయ మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. అమ్మాయిల చుట్టూ తిరగడం మానేసి, పది రోజులు కష్టపడాలని వార్నింగ్ కూడా ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన సెమీ ఫైనల్ ఆశ‌లు గల్లంతు అవుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఆడాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. మ‌హికా శ‌ర్మతో బాగా హ‌ర్ధిక్ పాండ్యా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ త‌రుణంలోనే గంభీర్ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

టీమిండియా సెమీస్ చేరాలంటే ఎలా ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సెమీ ఫైనల్ లోకి టీమిండియా ( Team India) ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా మరో రెండు మ్యాచ్ లు గెలవాలి. జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పై కచ్చితంగా టీమిండియా గెలవాలి. అలాగే నెట్ రన్ రేట్ కూడా పెంచుకోవాలి. అది జరిగితేనే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరుతుంది.

 

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×