Ambani Rayudu On ABD and kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరువు తీసేలా అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు ఐసీసీ ట్రోఫీలు తీసుకురావడంలో మహేంద్రసింగ్ ధోనీ తర్వాత రోహిత్ శర్మనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరే టీమిండియాకు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిన మొనగాళ్లు అంటూ కితాబు ఇచ్చారు. టీమిండియాకు చాలా మంది కెప్టెన్లు వచ్చినా కూడా.. ఐసీసీ ట్రోఫీలు తీసుకురావడంలో విఫలమయ్యారని కోహ్లీ పరువు తీశారు. అతని పేరు ఎత్తకుండా, పరోక్షంగా హింట్ ఇచ్చారు. కెప్టెన్ గా కొనసాగితే, టైటిల్ కచ్చితంగా తీసుకురావాలని, లేకపోతే తప్పుకోవాల్సిందేనని పరువు తీశారు అంబటి రాయుడు.
విరాట్ కోహ్లీ ఒక్క ట్రోఫీ టీమిండియాకు అందించలేదన్న వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు.. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మాలలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే విషయాన్ని బహిర్గతం చేశారు. ధోని ద్వారా టెక్నిక్స్ నేర్చుకున్న రోహిత్ శర్మ… ముంబై ఇండియన్స్ జట్టును చాలా సార్లు ఛాంపియన్ గా నిలిపాడని గుర్తు చేశారు. ఇది టీమిండియా కు కూడా 2024 టీ20 ప్రపంచ కప్ తీసుకువచ్చిన మొనగాడు అని ప్రశంసించారు. 2023 ప్రపంచ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళి టీమిండియాను రన్నరప్ గా రోహిత్ శర్మ నిలిపాడని ప్రశంసించారు. అటు మహేంద్ర సింగ్ ధోని మూడు ఐసీసీ ట్రోఫీలు తీసుకువచ్చిన ఏకైక మొనగాడు అని వెల్లడించారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే తాను చెప్పలేనన్నారు. కానీ ధోని నెంబర్ వన్ అయితే… రోహిత్ శర్మ నెంబర్ 2 కీలక వ్యాఖ్యలు చేశారు.
కీలక మ్యాచ్ లలో ఏబి డివిలియర్స్ విఫలమవుతూ వస్తాడని అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మనం ఆడేది కేవలం ట్రోఫీల కోసం మాత్రమే.. కానీ వాటినే గెలవకుండా ఉంటే వేస్ట్ అంటూ చురకలు అంటించారు. దక్షిణాఫ్రికాకు టైటిల్ తీసుకువచ్చేందుకు ఏబీ డివిలియర్స్ చాలా ప్రయత్నాలు చేశాడని.. కానీ అతని ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్లలో ఒత్తిడికి లోనై ఏబీ డివిలియర్స్ కు ఔట్ అయ్యేవాడు అన్నారు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.