Amit Mishra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు మ్యాచ్ లు ఫినిష్ అయితే టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇవాళ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరగనుండగా ఎల్లుండి అంటే మే 31వ తేదీన ఐపీఎల్ 2026 ఫైనల్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రవర్తన పైన టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit mishra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ బాంబు పేల్చారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అతని ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంటుందని మండిపడ్డారు. పాకిస్తాన్ వాళ్లతోనే రాసుకు పూసుకొని తిరుగుతాడు అంటూ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు శత్రు దేశ క్రికెటర్లతో విరాట్ కోహ్లీ చాలా క్లోజ్ గా ఉంటాడని మండిపడ్డారు అమిత్ మిశ్రా. చాలా సార్లు విరాట్ కోహ్లీ తో తాను మ్యాచ్ ఆడాను… పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా మేమిద్దరం ప్రాతినిధ్యం వహించినట్లు గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లతో విరాట్ కోహ్లీ ఎప్పుడు క్లోజ్ గానే ఉంటాడని.. వాళ్లతో రాసుకుపూసుకు తిరుగుతాడని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను దేశద్రోహి అనాల్సిందేనని సీరియస్ అయ్యారు అమిత్ మిశ్రా. ఇండియా గడ్డ పైన పుట్టి, పాకిస్తానోడికి సలాం కొట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహించారు. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ కూడా ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ షేక్ అండ్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియాకు వచ్చి ఎంతో ధైర్యంగా ఆడుతున్న హెడ్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ అత్యంత దారుణంగా ప్రవర్తించాడని మండిపడ్డారు అమిత్ మిశ్రా. పాకిస్తాన్ దేశం నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ పీఎస్ఎల్ ఆడకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు హెడ్ వచ్చినట్లు గుర్తు చేశారు. అలాంటి ఆటగాళ్ల ముందు దారుణంగా విరాట్ కోహ్లీ ప్రవర్తించాడని సీరియస్ అయ్యారు. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడని మండిపడ్డారు. హెడ్ ఇలాంటి అంతర్జాతీయ ప్లేయర్ కు గౌరవం ఇవ్వాల్సి ఉందని.. అలా ఇవ్వకపోతే ఇండియా పరువు పోతుందని ఫైర్ అయ్యారు అమిత్ మిశ్రా. దీనిపై కచ్చితంగా బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో హెడ్ ఎంత పెద్ద తప్పు చేసిన బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుంది.. కానీ విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మాత్రం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కు పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎవడు అంటూ నిలదీశారు.
https://www.facebook.com/photo/?fbid=3342568322570555&set=a.2580868458740549