E-Paper
Advertisement

Messi-Amruta Fadnavis: మెస్సీని అవ‌మానించిన సీఎం ఫడ్నవీస్ భార్య‌..బబుల్ గమ్ న‌ములుతూ టార్చ‌ర్ ?

Messi-Amruta Fadnavis: మెస్సీని అవ‌మానించిన సీఎం ఫడ్నవీస్ భార్య‌..బబుల్ గమ్ న‌ములుతూ టార్చ‌ర్ ?

Messi-Amruta Fadnavis: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మూడు రోజులుగా ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీన ఇండియాకు వచ్చిన లియోనెల్ మెస్సీ, మొదట పశ్చిమ బెంగాల్లోని క‌ల్ క‌తాలో పర్యటించి అక్కడి నుంచి నేరుగా తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో సందడి చేసిన అనంతరం, శనివారం బస చేసి ముంబై వెళ్లారు. ఆదివారం రోజున ముంబైకి చేరుకున్న లియోనెల్ మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అయితే ఆదివారం రోజున ముంబై వాంఖ‌డే స్టేడియంలో మెరిసిన లియోనెల్ మెస్సీకి ఘోర అవమానం ఎదురైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కారణంగా లియోనెల్ మెస్సీ చాలా ఇబ్బంది పడ్డారు. అమృత ఫడ్నవీస్ ( Amruta Fadnavis) ప్రవర్తన కారణంగా మెస్సీ అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెస్సీని అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్?

ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ ( Messi) ముంబైలోని వాంఖాడే స్టేడియంలో ఆదివారం సందడి చేశారు. లియోనెల్ మెస్సీ లాంటి ప్లేయర్ రావడంతో జనాలు కూడా స్టేడియానికి ఎగబడి వచ్చారు. అటు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోలు కూడా లియోనెల్ మెస్సీ ఈవెంట్ లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌వీస్‌ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్‌ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

లియోనెల్ మెస్సీతో సెల్ఫీ దిగేటప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫ‌డ్న‌వీస్‌ ప్రవర్తన ఇప్పుడు అభ్యంతరకరంగా మారింది. నోట్లో బబుల్ గమ్ వేసుకొని, అచ్చం సూర్యకుమార్ యాదవ్ లాగా నములుకుంటూ మెస్సీ దగ్గర కాస్త ఓవరాక్షన్ చేసింది. పదే పదే లియోనెల్ మెస్సీని డిస్టర్బ్ చేస్తూ సెల్ఫీలు అడిగింది. ఇక చేసేదేమీ లేక లియోనెల్ మెస్సీ అసహనంతో సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

మెస్సీని అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ పై మెస్సి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి భార్య స్థాయిలో ఉన్న అమృత ఫడ్నవీస్ చాలా ఓవర్ గా బిహేవ్ చేశారని మండిపడుతున్నారు. ఇండియాకు వచ్చిన గెస్ట్ తో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నిప్పులు జరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెస్సీకి మంచి ఆహ్వానం లభించడమే కాకుండా తేనేటి విందు లభించిందని గుర్తు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా పాటు ముంబైలో మెస్సీకి అవమానమే ఎదురయిందని నిప్పులు చెరుగుతున్నారు.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×