BigTV English

Anant Ambani – RCB : భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే ?

Anant Ambani – RCB :  భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే  ?

Anant Ambani – RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  ఐపీఎల్ 2025 వ సీజన్ లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 18 సీజన్ల నుంచి టైటిల్ రేస్ లో ఉండి.. మూడు సార్లు రన్నరఫ్ గా నిలిచింది. చివరికీ 18వ సీజన్ లో టైటిల్ సాధించింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టును తొలి సీజన్ లో విజయ్ మాల్యా కొనుగోలు చేయాలని భావించాడట. అయితే అయితే అప్పటికే అంబానీ కూడా బిడ్ వేయడంతో అధిక ధరకు కొనుగోలు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాడు విజయ్ మాల్యా. ఒకవేళ విజయ్ మాల్యా ముంబై జట్టును కొనుగోలు చేస్తే.. మాత్రం రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని నామకరణం చేయాలని భావించాడట. అయితే తాజాగా భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొనుగోలు చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read : Tiger Shroff : 6 ప్యాక్ తో క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో.. టీమిండియాలోకి తీసుకురండి !

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జూన్ 03న జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 బీసీసీఐ జేబులను నింపడమే కాకుండా జియో హాట్ స్టార్ వంటి ప్రసారకర్తలను కూడా డబ్బుతో నింపుతుంది. ఈ ఏడాది 64.3 కోట్ల మంది ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్ ను ఆస్వాదించాడు. గత ఏడాది 60.2 కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ చూశారు. ఈ సారి గత ఏడాది రికార్డు కూడా బద్దలైంది. జియో సినిమా, హాట్ స్టార్ విలీనం తరువాత ఈ ఏడాది కోట్లాది మంది జియో హాట్ స్టార్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ను ఆస్వాదించారు. ఈ మ్యాచ్ ముఖేష్ అంబానీ జేబులను నింపింది. హాట్ స్టార్, జియో సినిమా విలీనం తరువాత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో హాట్ స్టార్ లో 63.16 శాతం వాటా కలిగి ఉన్నది. ఇక ఇందులో 46.82 శఆతం వయాకామ్ 18 ద్వారా.. 16.34 శాతం ప్రత్యక్ష వాటా.. ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి.


విజయ్ మాల్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్టు తెలిపాడు. అయితే ముంబై ఇండియన్స్ ని కొని రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని పెట్టాలనుకున్నట్టు తెలిపాడు. అయితే ముఖేష్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్టు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తరువాత విజయ్ మాల్యా చివరికీ 112 మిలియన్ల యూఎస్ డాలర్ల కి ఆ సమయంలో ఆర్సీబీ ని కొనుగోలు చేశాడు. 2008లో 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ సుమారు రూ.600-700 కోట్లు.. ఆర్సీబీ ని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ ని ప్రోత్సహించడమే అని చెప్పుకొచ్చాడు విజయ్ మాల్యా. ఇదిలా ఉంటే.. భారీ ధరకు అనంత్ అంబానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని కొనాలనుకోవడం వార్త విని అందరూ ఆశ్యర్యపోవడం విశేషం. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×