E-Paper
Advertisement

Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

Arshdeep Singh:  ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ లో టీమిండియా సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫైన‌ల్స్ లో పాకిస్థాన్ పై టీమిండియా ఏకంగా 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అయితే… ఈ మ్యాచ్ నేప‌థ్యంలో అర్ష్ దీప్ సింగ్ చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Final Match, What’s Happening…అంటూ ఓ వీడియో తీసి… సోష‌ల్ మీడియ‌లో పంచుకున్నాడు అర్ష్ దీప్ సింగ్. పాక్ జ‌ట్టును ట్రోలింగ్ చేస్తూ… ఈ వీడియోను క్రియేట్ చేశారు అర్ష్ దీప్ సింగ్. అంతేకాదు… ఇందులో టీమిండియా ప్లేయ‌ర్ల‌ను కూడా ఇన్వాల్వ్ చేశారు. తిల‌క్ వ‌ర్మ‌, అభిషేక్ శ‌ర్మ కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో Final Match, What’s Happening… అనే మ‌రోసారి వైర‌ల్ గా మారింది.

Also Read: Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

ఆండ్రీ రస్సెల్ ఇన్సిడెంట్ రిపీట్ చేసి అర్ష‌దీప్ సింగ్‌

ఆండ్రీ రస్సెల్ కు ఎదురైన సంఘ‌ట‌న‌ను టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ అర్ష‌దీప్ సింగ్ మ‌రోసారి తెర‌పైకి తీసుకువ‌చ్చారు. గ‌తంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ గెలిచిన అనంత‌రం ఆండ్రీ ర‌స్సెల్ ను పాక్ రిపోర్టర్.. విన్నింగ్ మూమెంట్స్ గురించి ప్ర‌శ్నిస్తాడు. ఈ త‌రుణంలోనే.. Final Match, What’s Happening అంటూ ఆండ్రీ రస్సెల్ ను సద‌రు విలేక‌రీ ప్ర‌శ్నిస్తాడు. దీంతో అత‌డు ఏం అడిగాడో అర్థం కాక‌.. ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) త‌ల‌ప‌ట్టుకున్నాడు.

అస‌లు ఆ విలేక‌ర్ ఏం అడిగాడు…వాడికి ఏ ఆన్స‌ర్ ఇవ్వాలో అర్థం కాక‌.. త‌ల‌ప‌ట్టుకున్నాడు ఆండ్రీ రస్సెల్. ఆ త‌ర్వాత నిమ్మ‌లంగా ఈ ప్రశ్న‌ను మ‌రోసారి అడిగితే అర్థం చేసుకున్నాడు. ఇప్ప‌టికీ ఈ వీడియో వైర‌ల్ అవుతూనే ఉంటుంది. అయితే….అదే వీడియోను గుర్తు చేస్తూ… అర్ష‌దీప్ సింగ్ ఇమిటేట్ చేస్తూ వీడియో చేశాడు. Final Match, What’s Happening అంటూ అభిషేక్ శ‌ర్మ‌, జితేష్ శ‌ర్మ, హ‌ర్శిత్ రాణా, తిల‌క్ వ‌ర్మల‌ను ప్ర‌శ్నిస్తూ వీడియో తీశాడు అర్ష‌దీప్ సింగ్‌. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

అర్శ‌దీప్ సింగ్ పైన బ్యాన్ వేయాల‌ని కుట్ర‌లు

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య మ్యాచ్ జ‌రిగినప్పుడల్లా…. జెట్స్ గురించే చ‌ర్చ జ‌రిగింది. మొద‌ట హ‌రీస్ ర‌వూఫ్ గెలికాడు. ఇండియా జెట్స్ పేల్చేశామ‌ని..మొత్తం ఆరింటిని పేల్చిన‌ట్లు టీమిండియన్స్ ను రెచ్చ‌గొట్టాడు. ఇక దానికి అర్శ‌దీప్ సింగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. మీ పాకిస్థాన్ జెట్స్ ను మ‌డిచి పెట్టుకోవాల‌ని కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో అత‌నిపై వేటు వేయాల‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. బ్యాన్ విధించాల‌ని కూడా డిమాండ్ చేస్తోంది పాక్‌.

 

Also Read: IND Vs PAK : టీమిండియాను ఓడించేందుకు పాక్ కుట్రలు… గాయమైనట్లు నాటకాలు ఆడి.. అచ్చం రిషబ్ పంత్ నే దించేశాడుగా

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×