టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 5 టీ20 ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మూడు టి20 లు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా దక్షిణాఫ్రికా ఒక విక్టరీని నమోదు చేసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా రకరకాల పట్టణాలకు టీమిండియా జర్నీ చేస్తోంది. ఇలా ఈ చలికాలంలో జర్నీ చేయడం కారణంగా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం దెబ్బతిందని చెబుతున్నారు. జలుబుతో కూడిన విపరీతమైన జ్వరం అక్షర్ పటేల్ కు వచ్చిందట. దీంతో వారం రోజుల పాటు అక్షర్ పటేల్ కు రెస్టు అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే అక్షర్ పటేల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అతను స్థానంలో షాబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed ) జట్టులోకి రాబోతున్నాడు. కాగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4వ టీ20 మ్యాచ్ లక్నో వేదికగా డిసెంబర్ 17 వ తేదీన జరుగనుంది. డిసెంబర్ 19వ తేదీన ఫైనల్ టీ20 మ్యాచ్ జరుగనుంది.
టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ ( వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ దీప్సింగ్, హర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి, కె. షాబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed )
Axar Patel ruled out of the T20i series against South Africa due to illness!
Shahbaz Ahmed has been named as his replacement. pic.twitter.com/e98hVsLm5S
— CRICKETNMORE (@cricketnmore) December 15, 2025