E-Paper
Advertisement

Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?

Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?
Advertisement

Notice to Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. బెంగళూరులో విరాట్ కోహ్లీకి “వన్8 కమ్యూన్” అనే పబ్ ఉంది. అయితే ఈ పబ్ లో సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారంటూ బెంగుళూరు బృహత్ మహానగర పాలక ( బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. బెంగళూరు నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో ఉన్న ఎంజీ రోడ్డు లోని రత్నం కాంప్లెక్స్ లో ఈ పబ్ ఉంది. పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలక అధికారులు గుర్తించారు.

Also Read: KL Rahul Injured: టీమిండియాకు బిగ్ షాక్… నాలుగో టెస్ట్ కు ఆ ప్లేయర్ దూరం !

Advertisement

దీంతో ఈ పబ్ కి నోటీసులు జారీ చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండా నిర్వహిస్తున్నారని (బిబిఎంపీ) పేర్కొంది. సామాజిక కార్యకర్తలు హెచ్ఎం వెంకటేష్, కుణిగల్ నరసింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో బీబీఎంపీ ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు నవంబర్ 29 న జారీ చేయగా.. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశామని, ఏడు రోజుల్లోగా సమాధానం రాకపోతే పబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిబిఎంపీకి చెందిన శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.

బెంగళూరులో చాలా ఎత్తయిన భవనాలలో ఎన్నో రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు ఎటువంటి అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్నాయని సోషల్ వర్కర్ వెంకటేష్ తెలిపారు. ఇలాంటి ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గతంలోనూ ఈ పబ్ పై ఓ కేసు నమోదయింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఈ పబ్ ని నిర్వహిస్తున్నందుకు ఈ ఏడాది జూలైలో ఈ పబ్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. జులై 7 న పక్కా సమాచారంతో పిఎస్ఐ అశోక్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్ బృందం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఎంజీ రోడ్డు సమీపంలోని కస్తూర్బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ భవనం వద్ద ఉన్న (వన్ 8) కమ్యూన్ పబ్ పై దాడి చేశారు.

Advertisement

అర్ధరాత్రి రెండు గంటల వరకు పబ్ ని నడుపుతుండడంతో పబ్ మేనేజర్ పై కర్ణాటక పోలీసు చట్టం 1963 కింద కేసు నమోదు చేశారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, పూనే, కోల్కతాలో కూడా ఈ (వన్ 8) కమ్యూన్ బ్రాంచ్ లు ఉన్నాయి. బెంగళూరులోని పబ్ ని గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఆరవ అంతస్తులో ఉన్న బెంగళూరులోని ఈ పబ్ లో నుంచి కబ్బన్ పార్క్ అందాలను చూస్తూ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మొదటి నుంచి ఆడుతున్న కోహ్లీకి ఆ సిటీతో ఎంతో అనుబంధం ఉంది. అయితే ఈ పబ్ మాత్రమే కాకుండా ముంబై లోని కోహ్లీకి చెందిన రెస్టారెంట్ కూడా గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. పంచెతో వెళ్లిన ఓ వ్యక్తిని (వన్ 8) కమ్యూన్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. పంచెతో వచ్చినందువల్ల అతన్ని బయటికి పంపించేశారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇక ఇప్పుడు బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన పబ్ ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించకపోవడం వల్ల మరోసారి వార్తల్లో నిలిచింది.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×