E-Paper
Advertisement

India Vs England 3rd Test: ఇంగ్లాండ్‌తో చివరి 3 టెస్టులు.. భారత్ జట్టు ఇదే!

India Vs England 3rd Test: ఇంగ్లాండ్‌తో చివరి 3 టెస్టులు.. భారత్ జట్టు ఇదే!
Advertisement
Cricket news today telugu

India Vs England 3nd Test(Cricket news today telugu): ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి 3 టెస్టులకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. ఆకాశ్ దీప్ కు తొలిసారిగా జట్టులో చోటు దక్కింది.

విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కాని కోహ్లీ చివరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో లేడు. గాయంతో జట్టుకు దూరమైన జడేజా కోలుకున్నాడు. దీంతో మళ్లీ జట్టులో జడ్డూకు స్థానం కల్పించారు. అలాగే కేఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. అతడిని తిరిగి ఎంపిక చేశారు. రాహుల్, జట్టూ తొలి టెస్టు తర్వాత జట్టుకు దూరమయ్యారు. మూడో టెస్టు జరిగి సమయానికి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తే రాహుల్, జడేజా తుది జట్టులో ఉంటారు.

Advertisement

గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయలేదు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ను తిరిగి ఎంపిక చేశారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చినా వారిని పరిగణనలోకి తీసుకోలేదు. పేసర్ ఆకాశ్ దీప్ సింగ్ కు తొలిసారిగా భారత్ జట్టులో ఛాన్స్ దక్కింది.

Read More: Australia Vs India Under-19: అండర్ 19.. రేపే ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్..

Advertisement

టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్), జస్ ప్రీత్ బుమ్రా ( వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్‌, శుభ్ మన్ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్ జురెల్‌ (వికెట్ కీపర్), కేఎస్‌ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్ టీమిండియా గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఫిబ్రవరి 15 న రాజ్ కోట్ లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. అలాగే ఫిబ్రవరి 23 -27 మధ్య రాంచీలో నాలుగో టెస్టు జరుగుతుంది. మార్చి 7 -11 మధ్య ధర్మశాలలో ఐదో టెస్టు జరగనుంది.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×