BigTV English
Advertisement

India Tour of Bangladesh: పొలిటికల్ వార్… టీమిండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు?

India Tour of Bangladesh: పొలిటికల్ వార్… టీమిండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు?

India Tour of Bangladesh: భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టూర్ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్ తో వన్డే, టి-20 సిరీస్ ఆడడానికి భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. ఆగస్టులో జరగాల్సిన ఈ పర్యటనపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఈ పర్యటనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా..? లేదా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.


Also Read: Shubman Gill: కోహ్లీ కోసం ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్న గిల్… అసలు కారణం ఇదే

రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టూర్ రద్దు?


ప్రస్తుతం బంగ్లాదేశ్ – భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్ లు జరగడం అసంభవం అనిపిస్తోంది. కానీ బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్ లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో ఈ సిరీస్ లు వీలుకాకపోతే.. ఆ తర్వాత అయినా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మాట్లాడుతూ.. ” ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐ తో నిరంతర చర్చలు జరుపుతూనే ఉన్నాం.

వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సిరీస్ లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు వీలుకాకుంటే.. ఆ తర్వాత అయినా భారత్ కి ఆతిథ్యం ఇస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా ఈ పర్యటనను వాయిదా వేయలేదు. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉంది” అని బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు క్రీడాభిమానులు కూడా భారత్.. బంగ్లా పర్యటనకి వెళ్లాలని కోరుకుంటున్నారు.

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే.. ?

ఒకవేళ భారత జట్టు ఆగస్ట్ నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే.. బీసీబి ఐపీఎల్ – 2026 వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టి-20 ప్రపంచ కప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడిన భారత్.. ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడింది.

Also Read: Football Player Death: 10 రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి

అది ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ వెళ్ళింది. ఈ పర్యటన జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. అక్కడినుండి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ వెంటనే సౌతాఫ్రికా సిరీస్ ఉంది. ఈ పర్యటన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.

Related News

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

Big Stories

×