BigTV English

BCCI: అన్ని మూసుకొని ఫాలో కావాల్సిందే… కోహ్లీ దంపతులకు బీసీసీఐ కౌంటర్?

BCCI: అన్ని మూసుకొని ఫాలో కావాల్సిందే… కోహ్లీ దంపతులకు బీసీసీఐ కౌంటర్?

 


BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ  ( Kohli )దంపతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫైర్ అయ్యింది. తమ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని… వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అన్ని మూసుకొని… తాము పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందేనని హెచ్చరించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పకనే చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తాజాగా… టీమిండియా ప్లేయర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. విదేశీ టూర్లకు వెళ్తే… భార్యలకు పర్మిషన్లు లేవని… తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. రెండు వారాలకు మించి… కుటుంబ సభ్యులతో విదేశీ టూర్లలో గడపకూడదని కూడా తెలిపింది. ప్రవేట్ వెహికల్స్ లో మ్యాచ్లకు రాకూడదని… బీసీసీఐ ఇచ్చిన బస్సును వాడుకోవాలని సూచించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి.. పెట్టిన ఆహారాన్ని మాత్రమే తినాలని వెల్లడించింది. కాదని ప్రత్యేకంగా చెఫ్ ను తెచ్చుకోవడం బంద్ చేయాలని స్పష్టం చేసింది.

లగేజ్ కూడా ఎక్కువ బరువు ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇటీవల భారత జట్టు టెస్టు ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. గతంలో ఇలాంటి రూల్స్ ఉండేవి. కానీ… ఆ రూల్స్ గత కొన్ని రోజులుగా అమలు చేయడం లేదు. టీమిండియా ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ అమలు చేస్తోంది. అయితే బీసీసీఐ ప్రకటించిన కొత్త రూల్స్… పైన చాలామంది క్రికెటర్లు అలాగే మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా.. బహిరంగంగానే బిసిసిఐ పెట్టిన రూల్స్ ను వ్యతిరేకించాడు. భార్యలతో గడపడం….తప్ప అంటూ మండిపడ్డారు. అదే సమయంలో అనుష్క శర్మ కూడా ఈ బీసీసీఐ రూల్స్ పై స్పందించారు.


Also Read: Tilak Varma – SKY: తెలుగోడి బౌలింగ్‌…సూర్య కుమార్‌ ఫీజ్‌లు ఔట్‌ ?

భార్యాభర్తలను విడగొట్టేందుకు ఈ రూల్స్ పెట్టారా అన్న రేంజ్ లో అనుష్క శర్మ స్పందించారు. అయితే విరాట్ కోహ్లీ దంపతులు ఇద్దరు బీసీసీఐ రూల్స్ పైన స్పందించడంతో.. దేశవ్యాప్తంగా వివాదం రాజుకుంది. దీంతో రంగంలోకి బీసీసీఐ పెద్దలు దిగారు. విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్ పైన కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ సైకియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ రూల్స్ సమీప భవిష్యత్తులో అస్సలు మార్చబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపై కొందరికి ఆగ్రహం అలాగే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు… కానీ తమ రూల్స్ మార్చేది లేదని క్లారిటీ ఇచ్చారు. రాత్రి రాత్రే ఈ నిర్ణయాలు తీసుకోలేదు… టీమిండియాలో ఐక్యత రావడానికి ఈ రూల్స్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి నచ్చిన నచ్చకపోయినా ఫాలో కావాల్సిందేనని కౌంటర్ ఇచ్చారు బీసీసీఐ సెక్రటరీ సైకియా.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×