E-Paper
Advertisement

IPL 2026-Chinnaswamy : చిన్న‌స్వామిలో ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే… RCB vs SRH తొలి మ్యాచ్ ర‌ద్దు ?

IPL 2026-Chinnaswamy : చిన్న‌స్వామిలో ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే… RCB vs SRH తొలి మ్యాచ్ ర‌ద్దు ?
Advertisement

IPL 2026-Chinnaswamy : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ జూన్ మొదటి వారం వరకు కొనసాగనుండి. అయితే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువే అని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ( Chinnaswamy Stadium) రెనోవేషన్ ( Renovation) పనులు ఇంకా నడుస్తున్నాయని తెలుస్తోంది. అందుకే తొలి మ్యాచ్ జరగడం కష్టమే అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగడం కష్టమేనా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. అంటే మరో 48 గంటల్లోనే ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇక ఎల్లుండి తొలి మ్యాచ్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ చిన్నస్వామి వేదికగా జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టికెట్లు కూడా కొనుగోలు చేశారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వేదికగా రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి. అయితే ఈ పనులు పూర్తి స్థాయిలో కాలేదని నేషనల్ మీడియాలో ప్రచారం జోరు అందుకుంది.

అంటే ఎల్లుండి జరగబోయే మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinna swamy) సిద్ధం కాలేదు అన్నమాట. వాస్తవానికి మార్చి 15వ తేదీ వరకు ఈ రేనోవేషన్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ వర్క్ చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించాడని అంటున్నారు. అందుకే పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని చర్చ జరుగుతోంది. అయితే మరో 48 గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రెనోవేషన్ పనులు పూర్తి చేస్తారా ? లేదా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కానీ ప్రస్తుతానికైతే రెండు జట్లు కూడా చిన్నస్వామి స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. దీంతో 24 గంటలు కూడా వర్కర్లు రెనోవేషన్ పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక క్రికెట్ బోర్డు దగ్గరుండి ఈ పనులు చేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి మరో 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలని అభిమానులు అంటున్నారు.

Advertisement

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×