Yuvraj Singh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( MS DHONI ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెప్టెన్సీలో ఇండియా ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, దాదాపు 3 ICC ట్రోఫీలు అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పై తాజాగా యువరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని కంటే సీనియర్ అయిన తనకు కెప్టెన్సీ ఇవ్వకుండా బీసీసీఐ ( BCCI) నిర్ణయం తనను బాధించిందని వెల్లడించారు. ఆ ప్రకటన రాగానే తన రక్తం మరిగిపోయిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh). కానీ ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో పనిచేయాల్సి వచ్చిందని వివరించారు.
2007 రాహుల్ ద్రావిడ్ శకం ముగిసిన తర్వాత మహేంద్రసింగ్ ధోని టీమిండియా కెప్టెన్ గా ఎదిగారు. అదే సమయంలో టి20 ప్రపంచ కప్ టైటిల్ కూడా ఇండియాకు అందించిన క్రికెటర్ గా మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలోనే మూడు ఫార్మాట్లకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా నియామకం అయ్యాడు. అప్పటికే సీనియర్లుగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లను కాదని మహేంద్రసింగ్ ధోని నమ్మారు బీసీసీఐ పెద్దలు. అయితే ఈ విషయంపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించారు.
తనను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇవ్వగానే షాక్ అయ్యానని తెలిపారు. ఆ సమయంలో రక్తం మరిగిపోయిందని బాంబు పేల్చారు. ఎక్కడో ఝార్ఖండ్ నుంచి వచ్చి ఒకసారిగా ధోని కెప్టెన్ గా కావడం మిరాకిలని.. ఎవరు ఊహించని పరిణామం అని తెలిపారు యువరాజ్ సింగ్. ఆ సమయంలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వాళ్ల తర్వాత నేనే సీనియర్ ను.. అప్పటికే వైస్ కెప్టెన్సీ అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి… తనకు కాకుండా ధోనికి కెప్టెన్సీ ఇచ్చిందన్నారు. దట్టు కోసం ఎన్నో రోజులుగా కష్టపడ్డ తనకు మాత్రం పదవి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఇకపై ఐపిఎల్ లో ప్రదర్శన బట్టి, టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకూడదని కోరారు.
కపిల్, ధోనికి క్షమాపణలు చెప్తానని తాజాగా వెల్లడించారు యువరాజ్ సింగ్. యువీకి కెప్టెన్సీ చాన్స్ రాకపోవడం వెనుక ధోనీ కుట్ర ఉందని.. యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అసలు యువీని భారత జట్టు నుంచి తప్పించింది కూడా ధోనీయేనన్నారు యోగ్రాజ్ సింగ్. కపిల్ దేవ్ హయాంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. అయితే, దీనిపై కపిల్, ధోనికి క్షమాపణలు చెప్తానని తాజాగా స్పష్టం చేశారు యువరాజ్ సింగ్.
Also Read: IPL 2026: KKRపై సన్ రైజర్స్ బంపర్ విజయం..పాకిస్తాన్ లో సంబరాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్
🚨 BIG STATEMENT BY YUVRAJ SINGH ON MS DHONI 🚨🤯
Yuvraj Singh said 🗣️
"When I was part of the Indian team, players like Harbhajan Singh and Virender Sehwag were seniors, and I followed them in the hierarchy. At one point, I even served as vice-captain. Then suddenly, out of… pic.twitter.com/pMnOKF39Zj
— Cricket Central (@CricketCentrl) April 3, 2026