Trolls On Campa Cola: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో 18 పరుగులు తేడాతో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ “క్యాంపా కోలా” తాగుతూ మెరిసింది. అయితే ఇందులో కోకా కోలా ( Coca-Cola) కలిపి ఆమె తాగడం వివాదంగా మారింది. దీంతో “క్యాంపా కోలా” (Campa Cola) ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2026) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు ( Mumbai Indians vs Royal Challengers Bengaluru) మధ్య నిన్న కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ “క్యాంపా కోలా” తాగుతూ మెరిసింది. రిలయన్స్ కు సంబంధించిన ఈ “క్యాంపా కోలా” తాగిన మహికా శర్మ వీడియో వైరల్ గా మారింది. “క్యాంపా కోలా” సేల్స్ పెరిగేలా ఈ స్కెచ్ లు వేశారు. మహికా శర్మను తమ ప్రొడక్ట్ విక్రయించుకునేందుకు వినియోగించుకున్నారు. అయితే, ఈ “క్యాంపా కోలా” కూల్ డ్రింక్ లో మొదట కోకా కోలా పోయడం వివాదంగా మారింది.
మహికా శర్మ పక్కన ఉన్న ఓ వ్యక్తి “క్యాంపా కోలా” కప్పులో కోకా కోలా చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో అందరూ “క్యాంపా కోలా” పేరుతో కోకా కోలా పోసి అంబానీ మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. సేల్స్ కోసం, ఇలా దారుణాలకు పాల్పడుతున్నారని సీరియస్ అవుతున్నారు. అయితే, కొంత మంది మాత్రం అంబానీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ తెచ్చుకున్న “క్యాంపా కోలా” అయిపోయిందని, అందుకే వేరే వ్యక్తి కోకా కోలా పోస్తే, తాగిందని పేర్కొన్నారు. ఇందులో మహికా శర్మ, అంబానీది ఎలాంటి తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ముంబై వేదికగా జరిగిన బెంగుళూరు వర్సెస్ MI మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో బెంగుళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. అంటే ముంబై ఇండియన్స్ లక్ష్య చేదనలో విఫలమై, 222 పరుగులు చేసి చేతులెత్తేసింది. దీంతో 18 పరుగులు తేడాతో ముంబై పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ అందుకుంది.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==