BigTV English

Champions Trophy Pakistan Jersey: పాకిస్తాన్ జెర్సీ ధరించనున్న టీమిండియా.. ధృవీకరించిన బిసిసిఐ

Champions Trophy Pakistan Jersey: పాకిస్తాన్ జెర్సీ ధరించనున్న టీమిండియా.. ధృవీకరించిన బిసిసిఐ

Champions Trophy Pakistan Jersey| చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా ధరించబోయే పాకిస్తాన్ పేరుగల జెర్సీపై వస్తున్న పుకార్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. ఐసీసీ నిబంధనలను తాము పూర్తిగా పాటిస్తున్నామని, తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్ పేరు ఉండటాన్ని వ్యతిరేకించారని వస్తున్న వార్తలు నిరాధారమని స్పష్టం చేశారు.


జెర్సీ లోగో వివాదంపై బీసీసీఐ స్పందన
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆతిథ్య దేశం పేరు అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ముద్రించి ఉంటుంది. అయితే పాకిస్తాన్ పేరు తమ జెర్సీపై ఉండకూడదని ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండిస్తూ, ‘‘మేము ఐసీసీ నియమావళిని పూర్తిగా పాటిస్తున్నాం. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఐసీసీ రూపొందించిన డ్రెస్‌ కోడ్‌ మరియు లోగో నియమాలను పాటిస్తాం. ఇలాంటి నిరాధార వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు,’’ అన్నారు.

దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు
ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లో ప్రారంభమవుతున్న చాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లకపోవడానికి భద్రతా కారణాలు ప్రధానం. దీంతో ఐసీసీ అనుమతితో దుబాయ్‌ను తటస్థ వేదికగా బీసీసీఐ ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో పాటు దుబాయ్ కూడా ఈ మెగా టోర్నీకి ఆతిథ్య దేశంగా మారింది.


టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

భారత్‌-పాక్‌ కీలక మ్యాచ్‌
ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఫిబ్రవరి 5లోగా మైదానాలు సిద్ధం: పీసీబీ
పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) చాంపియన్స్‌ ట్రోఫీ కోసం కరాచీ, లాహోర్ స్టేడియాలను ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు, అధునాతన సౌకర్యాలతో స్టేడియాలను ముస్తాబ చేస్తోంది. ఫిబ్రవరి 5 నాటికి అన్ని పనులు పూర్తవుతాయని పీసీబీ తెలిపింది.

ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు సిరీస్ ఈ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.

భారత ఆడబోయే మ్యాచ్‌లు
దుబాయ్‌ వేదికగా భారత్‌ తమ గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ (ఫిబ్రవరి 20), పాకిస్తాన్‌ (ఫిబ్రవరి 23), న్యూజిలాండ్‌ (మార్చి 2)లతో తలపడనుంది. సెమీఫైనల్‌ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×