E-Paper
Advertisement

Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

Chatgpt On IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) తొలి దశ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన తొలిదశ షెడ్యూల్ను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఈ తొలి దశ టోర్నమెంట్ జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రెండో దశ ఐపిఎల్ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

 

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

ఐపీఎల్ 2026 విజేత ఎవరో చెప్పిన చాట్ జిపిటి

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాట్ జిపిటి వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన విజేత ఎవరు అనేదాని పైన చాట్ జిపిటి క్లారిటీ ఇచ్చింది. చాట్ జిపిటి లెక్కల ప్రకారం ఐపిఎల్ 2026 టోర్నమెంట్ విజేత గుజరాత్ టైటాన్స్ అని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని చాట్ జిపిటి వెల్లడించింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించనున్నట్లు పేర్కొంది చాట్ జిపిటి. ఇక ఈ టోర్నమెంటులో అత్యధిక పరుగులు యశస్వి జైష్వాల్ చేస్తాడని పేర్కొంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తాడని పేర్కొంది చాట్ జిపిటి. అలాగే, ఐపీఎల్ 2026 లో ఎక్కువ వికెట్లు తీసేది బూమ్ బూమ్ బుమ్రా అని పేర్కొంది. ఇక రన్నరప్ గా ముంబై ఇండియన్స్ నిలువనున్నట్లు చాట్ GPT ( Chatgpt ) తెలిపింది.

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఇదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తొలి దశ షెడ్యూల్ నిన్న రిలీజ్ అయింది. మార్చి 28వ తేదీ నుంచి ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. తొలి దశ షెడ్యూల్ ప్రకారం మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మాత్రమే ఈ మ్యాచ్ లు కొనసాగుతాయి. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం మొట్ట మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉంటుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండు జట్లు తలపడతాయి. అయితే ఈ షెడ్యూల్ నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం వేదికగా మ్యాచ్లు నిర్వహించాలంటే మూడు కండిషన్లు పెట్టింది బీసీసీఐ. చిన్నస్వామి స్టేడియంలో ( Chinna swamy stadium) మ్యాచ్ జరిగితే 30 వేల కంటే ఎక్కువ కెపాసిటీ దాటకూడదు. 35 వేల టికెట్లు అమ్ముకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. 30 వేలకే ఫైనల్ చేయాలని పేర్కొంది. అలాగే స్టేడియం బయట ఎలాంటి సంబరాలు చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నస్వామి స్టేడియం గేట్లు పెద్దగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది.

 

 

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×