Jadeja Boundary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా.. శనివారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. శనివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన కేవలం రెండు పరుగులు తేడాతోనే విజయం సాధించింది. అయితే ఆ రెండు పరుగుల విషయంలో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఫీల్డ్ అంపైర్ నితిన్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నష్టపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: CSK VS RCB: కోహ్లీ చెత్త ఫీల్డింగ్…CSK చేసిన తప్పిదం ఇదే.. RCB రియల్ హీరో యశ్ దయాల్
జడేజా ( RAvindra Jadeja) కుట్టిన బంతిని ఆపిన అంపైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు సుయాస్ శర్మ వేసిన ఓవర్ లో జడేజా నేరుగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. వికెట్లకు నేరుగా షాట్ బాదాడు. అయితే వికెట్ల దగ్గర ఉన్న అంపైర్… నితిన్ ఆ బంతి నుంచి తప్పించుకోబోయి… కాలుకు తగిలించుకున్నాడు. దీంతో బౌండరీ వెళ్లాల్సిన ఆ బంతి… సింగిల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంకేముంది చెన్నై అభిమానులు కొత్త చర్చకు తెరలేరు. అంపైర్ నితిన్ ( umpire nitin menon ).. కావాలనే ఆ బంతిని ఆపాడాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. లేకపోతే ఆ బంతి నేరుగా బౌండరీ వెళ్లేదని చెబుతున్నారు. అతడు బంతి ఆపకపోయి ఉంటే బౌండరీ వెళ్లడమే కాకుండా మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వశం అయ్యేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
రెండు పరుగుల తేడాతో ఊడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో రెండు పరుగులు తేడాతోనే ధోని సేన ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి… కేవలం 5 వికెట్లు నష్టపోయి 213 పరుగులు. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. చేదించే క్రమంలో మొత్తం 20 ఓవర్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐదు వికెట్లు నష్టపోయి 211 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ అంపైర్… బౌండరీ ఆపకపోయి ఉంటే మ్యాచ్ చెన్నై గెలిచేది.
Also Read: Mitchell Owen – PSL: పాకిస్థాన్ కు ప్రీతి జింటా ఎదురుదెబ్బ…PSL ను వదిలి కుక్కలా వచ్చేశాడు
Umpiring was so against CSK that they stopped a four too 😭😭😭pic.twitter.com/yFgfVdHnm1 https://t.co/KaW1XzUQdL
— Div🦁 (@div_yumm) May 4, 2025