Dunith Wellalage’s father : ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక విజయం సాధించిన సంతోషం కూడా లేకుండా పోయింది. శ్రీలంక జట్టులో విషాదం నెలకొంది. శ్రీలంక ఆటగాడు దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే కొలొంబోలో గుండెపోటుతో మరణించాడు. దీంతో జట్టుకి సంతోషం లేకుండా పోయింది. అయితే తన తండ్రి మరణించడంతో దునిత్ వెల్లాలగే కొలొంబోకి వెళ్తాడా..? లేక జట్టుతోనే ఉంటాడా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జట్టు సభ్యులు దునిత్ వెల్లాలగే ని ఓదార్చుతున్నారు. కొన్ని మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు కొందరూ ఆటగాళ్లు తమ తల్లి లేదా తండ్రి మరణించినా తమకు ఆటనే ముఖ్యమని జట్టుతోనే ఉంటారు.
Also Read : RCB : వీడురా RCB ఫ్యాన్ అంటే… ప్లేయర్లందరి పేరు రాసుకున్నాడు
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన తండ్రి మరణించినప్పుడు ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు. 90 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి కాపాడిన తరువాతనే తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో 5 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో మొత్తం నో బాల్ తో కలిపి 32 పరుగులు రావడం విశేషం. తన తండ్రి గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించాడు. తన కుమారుడి బౌలింగ్ లో మహ్మద్ నబీ 5 సిక్సర్లు కొట్టాడని తట్టుకోలేక చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నీలో గ్రూపు బీ నుంచి శ్రీలంక-బంగ్లాదేశ్ సూపర్ 4 కి అర్హత సాధించాయి.
శ్రీలంక వర్సెస్ అప్గాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గ్రూపు లో మూడు విజయాలతో శ్రీలంక ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ప్లేరెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అప్గానిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ -4 కి అర్హత చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ముఖ్యంగా అప్గానిస్తాన్ బ్యాటర్ మహ్మద్ నబి 22 బంతుల్లో 60 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెల్లలాగే వేసిన చివరి ఓవర్ లో నబీ ఏకంగా 5 సిక్స్ లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లలో అతను వరుసగా6, 6,6, నోబాల్, 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 74 నాటౌట్. అర్థ సెంచరీతో జట్టును గెలిపించగా.. కుశాల్ పెరీరా(28), కమిందు మెండిస్ (26) రాణించా రు. దీంతో శ్రీలంక విజయం సాధించింది.
𝐇𝐞𝐚𝐫𝐭𝐛𝐫𝐞𝐚𝐤 𝐟𝐨𝐫 𝐃𝐮𝐧𝐢𝐭𝐡 𝐖𝐞𝐥𝐥𝐚𝐥𝐚𝐠𝐞!
Dunith Wellalage’s father, Suranga Wellalage, has passed away in Colombo following a suspected heart attack.
Our heartfelt condolences to Dunith and his entire family during this difficult time.#DunithWellalage… pic.twitter.com/1JHMVPlOcx
— Sportskeeda (@Sportskeeda) September 18, 2025