Gambhir – Pant: టీమిండియా జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడు.. అప్పటినుంచి టీమిండియా గాడి తప్పింది. తన మాట వినని వాళ్లను టార్గెట్ చేసి గౌతమ్ గంభీర్ కుట్రలు చేస్తున్నాడట. మళ్లీ జాతీయ జట్టులో ఆడకుండా ప్లేయర్లపై పన్నాగం పన్నుతున్నాడట గౌతమ్ గంభీర్. మొన్నటి వరకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పై కుట్రలు పన్నిన గౌతమ్ గంభీర్, ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి డేంజర్ ఆటగాడిని టార్గెట్ చేశాడట. రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్ మధ్య దాదాపు రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ జట్టులో పంత్ కు అవకాశం రాకుండా గౌతమ్ గంభీర్ కుట్రలు పన్నుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే రిషబ్ పంత్ మధ్య గొడవలు జరుగుతున్నాయట. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య గౌహతి వేదికగా నవంబర్లో రెండవ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మెడనొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు గిల్. దీంతో పంత్ జట్టు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆ టెస్టు సందర్భంగా గౌతమ్ గంభీర్ చెప్పిన రూల్స్ పాటించకుండా, తనకు నచ్చినట్లు వ్యవహరించాడట రిషబ్ పంత్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే తన రూట్లో వెళ్లిపోయాడట పంత్. ఇది కక్ష పెట్టుకున్న గౌతమ్ గంభీర్… పంతుకు చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడట. అటు రిషబ్ పంత్ కూడా ఏమాత్రం తగ్గలేదని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే క్రమశిక్షణ పేరుతో రిషబ్ పంత్ పై వేటువేయాలని బిసిసిఐ కి చాలాసార్లు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో రిషబ్ పంత్ లాంటి డేంజర్ ఆటగాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయ్యారు.
న్యూజిలాండ్ తో త్వరలోనే 3 వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నమెంటుకు ఈనెల ఏడవ తేదీన టీమిండియా జట్టును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కూడా రిషబ్ పంత్ ను పక్కకు పెట్టాలని కుట్రలు జరుగుతున్నాయట. దీనంతటికీ కారణం గౌతం గంభీర్ అంటున్నారు. రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ కు అవకాశం రానుందట. ఇలాగే ఇద్దరి మధ్య గ్యాబ్ పెరిగితే, రిషబ్ పంత్ మళ్లీ జాతీయ జట్టులో కనిపించడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.
🚨 BIG UPDATE ON GAUTAM GAMBHIR & RISHABH PANT RELATIONS 🚨
"Nothing is going well between coach Gautam Gambhir and Rishabh Pant. There has been no communication between them since the Guwahati Test."Due to this, Pant is now facing problems in ODI cricket, and is being dropped… pic.twitter.com/fokSzt76V1
— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 1, 2026