E-Paper
Advertisement

India vs Zimbabwe: సంజును బండ‌బూతులు తిట్టిన గంభీర్‌…టీమిండియా స్కోర్ 250 క్రాస్‌

India vs Zimbabwe: సంజును బండ‌బూతులు తిట్టిన గంభీర్‌…టీమిండియా స్కోర్ 250 క్రాస్‌
Advertisement

India vs Zimbabwe: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ టోర్నమెంట్ సందర్భంగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ చెన్నై లోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రింకూ సింగ్ స్థానంలో ఎట్టకేలకు సంజు శాంస‌న్‌ కు అవకాశం వచ్చింది. దీంతో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంస‌న్‌, 15 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ ఉంది. మంచి స్టార్టింగ్ అందుకున్న సంజు, పెద్ద ఇన్నింగ్స్ ను మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిన సంజు శాంస‌న్‌ కు గంభీర్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే, వీళ్ల సంభాష‌ణ‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. తొందరగా ఔట్ అయినందుకు సంజు శాంస‌న్‌ను గంభీర్ తిట్టాడని కొంతమంది ఈ అంశంపై పోస్టులు పెడుతున్నారు. ఇంకేన్ని ఛాన్సులు ఇవ్వాల‌ని గంభీర్ సీరియ‌స్ అయిన‌ట్లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇక‌ మరికొంతమంది సంజుకు గంభీర్ స‌లహా సూచనలు ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారారు.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియా స్కోర్ 250 క్రాస్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా , 256 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా సునామీ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. టీమిండియా 256 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 257 ప‌రుగులు సాధిస్తే, జింబాబ్వే విజ‌యం సాధించ‌నుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు కసిగా ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు సంజు 24 పరుగులతో టచ్ లోకి వచ్చాడు. అటు అభిషేక్ శర్మ చాలా రోజుల తర్వాత అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 30 బంతుల 55 పరుగులు సాధించి ఇరగదీశాడు అభిషేక్ శర్మ.

ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. అటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి రఫ్పాడించాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టెస్టు ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో 275 స్ట్రైక్ రేటుతో 44 పరుగులు సాధించాడు తిలక్ వర్మ. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. ఇంకా ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 257 పరుగులు చేస్తే జింబాబ్వే విజయం సాధిస్తుంది.

Advertisement

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×