India vs Zimbabwe: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ టోర్నమెంట్ సందర్భంగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ చెన్నై లోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రింకూ సింగ్ స్థానంలో ఎట్టకేలకు సంజు శాంసన్ కు అవకాశం వచ్చింది. దీంతో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంసన్, 15 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ ఉంది. మంచి స్టార్టింగ్ అందుకున్న సంజు, పెద్ద ఇన్నింగ్స్ ను మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిన సంజు శాంసన్ కు గంభీర్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే, వీళ్ల సంభాషణపై రకరకాల చర్చ జరుగుతోంది. తొందరగా ఔట్ అయినందుకు సంజు శాంసన్ను గంభీర్ తిట్టాడని కొంతమంది ఈ అంశంపై పోస్టులు పెడుతున్నారు. ఇంకేన్ని ఛాన్సులు ఇవ్వాలని గంభీర్ సీరియస్ అయినట్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక మరికొంతమంది సంజుకు గంభీర్ సలహా సూచనలు ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా , 256 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా సునామీ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. టీమిండియా 256 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 257 పరుగులు సాధిస్తే, జింబాబ్వే విజయం సాధించనుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు కసిగా ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు సంజు 24 పరుగులతో టచ్ లోకి వచ్చాడు. అటు అభిషేక్ శర్మ చాలా రోజుల తర్వాత అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 30 బంతుల 55 పరుగులు సాధించి ఇరగదీశాడు అభిషేక్ శర్మ.
ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. అటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి రఫ్పాడించాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టెస్టు ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో 275 స్ట్రైక్ రేటుతో 44 పరుగులు సాధించాడు తిలక్ వర్మ. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. ఇంకా ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 257 పరుగులు చేస్తే జింబాబ్వే విజయం సాధిస్తుంది.
Head coach Gautam Gambhir having a chat with Sanju Samson after his dismissal 🗣️
📸:- JioHotstar #INDvsZIM #Super8s #T20WC2026 #Insidesport #CricketTwitter pic.twitter.com/vHQL1YcEsh
— InsideSport (@InsideSportIND) February 26, 2026