E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వైభ‌వ్ పై గంభీర్ పాలిటిక్స్ షురూ… 15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?

వైభ‌వ్ పై గంభీర్ పాలిటిక్స్ షురూ… 15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?
Advertisement

Gambhir On Vaibhav: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs India) మధ్య ఇవాళ టి20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) షురూ అయింది. సాయంత్రం 6 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ20 సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ ( Civil Service Cricket Club, Belfast) వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. అయితే, ఈ టి20 సిరీస్ సందర్భంగా తొలి మ్యాచ్ లలోనే 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో అతనికి నిరాశ ఎదురయింది. గౌతమ్ గంభీర్ (Gautam gambhir) కారణంగానే వైభవ్ ను పక్కకు పెట్టారని తెలుస్తోంది. సంజు శాంసన్ కోసం వైభవ్ ను బలి చేశాడని అంటున్నారు.

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?

Advertisement

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఇవాళ తొలి టీ20 ప్రారంభమైంది. ఈ రెండు దాంట్లో మధ్య టి20 నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా యాజమాన్యం అంత సాహసం చేయలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లను బరిలోకి దింపనుంది. వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఆడివుంటే.. సంజు శాంసన్ పైన వేటుపడేది. కానీ ఆ జట్టును డిస్టర్బ్ చేయకుండా… వైభవ్ ను తప్పించారు. దీంతో వైభవ్ సూర్య వంశీ నిరాశ చెందారు. అటు అతని అభిమానులు కూడా… గౌతమ్ గంభీర్ పై సీరియస్ అవుతున్నారు. వాడి వల్లే వైభవ్ అరంగేట్రం మిస్ అయిందని మండిపడుతున్నారు.

సంజు కోసం వైభవ్ ను బలి చేశాడంటూ ట్రోల్స్ ?

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య తొలి టెస్ట్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని తప్పించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయం కారణంగా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ కు అవకాశం రాలేదని అంటున్నారు. సంజు శాంసన్ కోసం వైభవ్ ను తప్పించాడని సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. వైభవ్ స్థానంలో సంజు ను ఆడించాల్సిందేనని గౌతమ్ గంభీర్ పట్టుబట్టారట. వైభవ్ నేర్చుకోవాల్సిన సమయం చాలా ఉందని… అతనికి భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వాలని శ్రేయస్ అయ్యర్ కు గంభీర్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఐర్లాండ్ తో మ్యాచ్ కాబట్టి వైభవ్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని అయ్యర్ పదేపదే మొత్తుకున్నాడట. కానీ గంభీర్ మాత్రం కరాకండిగా.. వైభవ్ ను వద్దని చెప్పాడట. దీంతో వైభవ్ సూర్యవంశీకి నిరాశ ఎదురైందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Advertisement

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

 

 

 

Related News

Michael Vaughan: గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా? వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు

Tanveer Ahmed: రొమాన్స్, షికార్లు చేయ‌డానికి మిమ్మ‌ల్ని ఇంగ్లండ్ పంప‌లేదు

Salman Butt: అలాంటి బంతులు వైభ‌వ్ ఎదుర్కొలేడు, 20 ఏళ్ల‌కే కెరీర్ క్లోజ్

Ashwin: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు

నెద‌ర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా విజ‌యం…టీమిండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు ?

ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

IND VS IRE: వైభ‌వ్ ను ఆడించ‌డం దండ‌గే, వాడి కోసం మంచి ప్లేయ‌ర్ల‌ను తొల‌గించ‌డం క‌రెక్ట్ కాదు!

Big Stories

×