Jayasurya checking Siraj Bat: టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మహమ్మద్ సిరాజ్ పేరు మారుమోగుతోంది. తాజాగా శ్రీలంక ఎలెవన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టిన మహమ్మద్ సిరాజ్… చివరలో హ్యాట్రిక్ కొట్టి టీమ్ ఇండియాను గెలిపించాడు. దీంతో ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్… ఎలా ఫాస్ట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడని అందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత వెంటనే మహమ్మద్ సిరాజ్ బ్యాట్ తీసుకొని.. లంక ప్లేయర్లు చెక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంఘటన వివాదంగా మారింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) భారీగా సిక్సర్లు కొట్టిన నేపథ్యంలో అతని బ్యాట్ శ్రీలంక మాజీ క్రికెటర్, ఆ జట్టు మాజీ కోచ్ సనత్ జయసూర్య కూడా షాక్ అయ్యాడు. ఇందులో భాగంగానే డ్రెస్సింగ్ రూమ్ లోకి మహమ్మద్ సిరాజ్ ను పిలిపించుకున్నాడు. ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ కొట్టిన బ్యాట్ ను చెక్ చేశాడు. ఓ అమ్మాయి ముందే.. మహమ్మద్ సిరాజ్ పరువు తీసే ప్రయత్నం చేశాడు. బ్యాట్ లో స్ప్రింగ్ లు పెట్టావా ? ఏమైనా ఏఐ చిప్స్ ఫిక్స్ చేసావా ? అంటూ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శనను కించపరిచే సనత్ జయసూర్య వ్యవహరించినట్లు ఓ ఫోటో, వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఓ దోషి లాగా సనత్ జయసూర్య (Sanath Jayasuriya) ముందు నిలబడ్డాడు మహమ్మద్ సిరాజ్. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈ వీడియో ఫేక్ అని, ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో షురూ అవుతుంది. ఇప్పటికే రెండు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా అద్భుతంగా రానించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 15వ తేదీ నుంచి అసలు సిసలైన టెస్ట్ సిరీస్ షురూ అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే వేదికగా రెండు జట్లు తలపడతాయి. ఉదయం 10 సమయంలో ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఇక 23వ తేదీన రెండో టెస్టు కొలంబో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా కీలకము. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో అర్హత సాధించాలంటే కనీసం ఏడు మ్యాచ్ లలో విజయం సాధించాలి టీమ్ ఇండియా. WTC సైకిల్ లో మరో 9 మ్యాచ్ లు టీమిండి ఆడాల్సి ఉంది. మరి ఇందులో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు