ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 3 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ రెండింట్లో విజయం సాధించింది. ఢిల్లీ ఒక మ్యాచ్ గెలిచింది.
రెండు జట్ల బలాబలాలను చూస్తే శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ దూకుడుగా లేదు. ఫర్వాలేదన్నట్టు ఆడుతోంది. గిల్ ఆడితేనే మ్యాచ్ అన్నట్టుగా ఉంది. వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఓమర్ జాయ్ వీరెవరూ ఇంకా బ్యాట్ ఝులిపించ లేదు.
బౌలింగ్ బలంగా ఉండటం వల్లే, ఆ మూడు మ్యాచ్ లైనా గుజరాత్ గెలిచిందని చెప్పాలి. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, ఓమర్ జాయ్ వీరందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇంకా పుంజుకున్నట్టు కనిపించలేదు. ఒకవైపు నుంచి బ్యాటర్లు పరుగులు తీస్తుంటే, కీపర్ కమ్ కెప్టెన్ అయిన పంత్ వెంటనే ఫీల్డింగ్ సెట్ అప్ మార్చడం, లేదా సీనియర్ల సలహాలు తీసుకుని ఆలోచనలు చేయడం, బ్యాటర్లకు తగినట్టుగా బౌలింగ్ వనరులు వినియోగించడం లాంటివి చేయడం లేదు.
ప్రత్యర్థులు కొడుతుంటే, ఒక కామన్ మేన్ లా తను కూడా అలా చూస్తూ గడిపేస్తున్నాడు. కొద్దిగా కెప్టెన్సీ వ్యూహాలకు పంత్ పదును పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ప్రథ్వీ షా, డేవిడ్ వార్నర్, అభిషేక్ , ట్రిస్టన్ స్టబ్స్ వీరందరూ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. రిషబ్ పంత్ తన గేమ్ తను ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా వీక్ గా ఉంది. మరి రెండు జట్లు వారి బలహీనతలను దాటి ఎవరు గెలిచి ముందడుగు వేస్తారో వేచి చూడాల్సిందే.