Hasan Ali: పాకిస్తాన్ క్రికెట్ ( Pakistan Cricket) పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓడిపోతూ, పరువు తీసుకుంటోంది. పాకిస్తాన్ పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా దారుణంగా అన్ని టోర్నమెంట్లలో ఓడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ పురుషుల జట్టు (Pakistan Cricket Team) పతనానికి టీమిండియా క్రికెటర్లు కారణమంటూ బాంబు పేల్చారు హసన్ అలీ. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ భయంకరమైన బ్యాటింగ్ వల్ల, పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైందని బాంబు పేల్చారు. అందుకే పాకిస్తాన్ కోల్కోలేక పోతోందని వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టారని కోహ్లీ, రాహుల్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు హసన్ అలీ. దీంతో హసన్ అలీ ( Hasan Ali) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ క్రికెట్ పతనా స్థితిలో ఉందనిద హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణంగా ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరు భయంకరమైన బ్యాటింగ్ పాకిస్తాన్ పై చేశారని… అందువల్లే తమ జట్టు పతనమైందని హసన్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ కు ముందు మేము బాగా రాణించే వాళ్ళమని… వరుసగా సిరీస్ లు గెలిచే వాళ్ళమని పేర్కొన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ పాకిస్తాన్ పై భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాలని గుర్తు చేశారు. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ ఇద్దరు సెంచరీలు చేశారని వ్యాఖ్యానించారు. ఈ దెబ్బకు వరుసగా పాకిస్తాన్ ఓడిపోతూ వస్తోందన్నారు.
ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా 128 పరుగులకే టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఆల్ అవుట్ అయినట్లు వెల్లడించారు. ఆ సమయంలో టీమిండియా తమపై గెలిచిందని… ఈ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఘోర అవమాన ఓటమిని చవిచూసిందని గుర్తు చేశారు హసన్ అలీ. అప్పటినుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎక్కడ కోలుకోలేదని వెల్లడించారు. 2023 ప్రపంచ కప్ సమయంలో కూడా టీమిండియా చేతిలో ఓడిపోయామని… అటు బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్ల చేతిలో సిరీస్ లు కూడా కోల్పోయినట్లు వివరించారు. ఆస్ట్రేలియాపై మొన్న సిరీస్ గెలవడం తప్ప.. గడిచిన రెండు సంవత్సరాలలో పాకిస్తాన్ సాధించిన విజయాలు ఏమీ లేవని కుండ బద్దలు కొట్టి చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ అంతం కావడం గ్యారెంటీ అన్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.