E-Paper
Advertisement

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ
Advertisement

Rishabh Pant Playing Football: టీమిండియా కుర్ర క్రికెటర్ రిషబ్ పంత్ మంచి ఎంటర్టైనర్ అన్న సంగతి తెలిసిందే. అతడు గ్రౌండ్ లో ఉన్నంత సేపు అందరినీ నవ్విస్తూ ఉంటాడు. క్రికెట్ మైదానంలో జిమ్నాస్టిక్స్ చేస్తూ, అందరూ ఆశ్చర్యపడేలా చేస్తూ ఉంటాడు. అయితే లేటెస్ట్ గా శ్రీలంకతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా బంతితో ఫుట్ బాల్ ఆడాడు. బ్యాటింగ్ చేస్తుండగా బంతి లెగ్ సైడ్ రావడంతో.. తన లెఫ్ట్ లెగ్గుతో, తన్నేసాడు. దీంతో బంతి వెళ్లి మిడ్ వికెట్ దగ్గర పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం రిషబ్ పంత్ కు ( Rishabh Pant ) బలుపెక్కువ అంటూ ఫైర్ అవుతున్నారు.

శ్రీలంక‌పై టీమిండియా విజ‌యం..6 వికెట్ల తేడాతో

శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి ఈ రెండు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమిండియా అద్భుతంగా రాణించి… ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించగలిగింది. అటు రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 6 వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి డిక్లేరు చేసింది. ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఈ క్రమంలో ఆరు వికెట్ల తేడాతో విక్టరీ సాధించగలిగింది.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ

శ్రీలంక వర్సెస్ టీమిండియా (Sri Lanka Cricket XI vs India) మధ్య జరిగిన వార్మ‌ప్ టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ బంతిని ఫుట్ బాల్ ఆడాడు. లంక స్పిన్నర్ వేసిన ఓ బంతి వైడ్ దిశగా వెళ్ళింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. ఆ బంతిని కాలితో గట్టిగా తన్నాడు. అచ్చం ఫుట్బాల్ ను తన్నినట్లుగానే తన్నేసాడు. దీంతో బంతి ఫీల్డర్ల అవతల పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం రిషబ్ పంత్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్క‌ర్ సింగ్ ధామీని ఉద్దేశించి రిషబ్ పంత్ వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. తాను ఇల్లు కట్టుకునేందుకు భూమిని కేటాయించాలని.. సోషల్ మీడియా వేదికంగా నిలదీసే ప్రయత్నం చేశారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

 

 

Related News

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను

బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

సెప్టెంబ‌ర్ వ‌ర‌కే ఈ జ‌ల్సాలు…ఆ త‌ర్వాత వైభ‌వ్ ను ఇంటికి పంపిస్తాం !

నల్ల జాతీయులను సెల‌క్ట్ చేయొద్దు..ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌పై పీట‌ర్సన్ సంచ‌ల‌నం !

నేనైతే 150KM స్పీడ్ తో వైభ‌వ్ త‌ల‌ ప‌గిలేలా బంతులు వేస్తా..బ్రెట్ లీ హెచ్చ‌రిక‌

టీమిండియా క్రికెట‌ర్లు పెద్ద దొంగ‌లు..గాయాల పేరుతో జారుకున్న 9 మంది ?

Big Stories

Advertisement
×