Virender Sehwag On 2027 Odi World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 Odi World Cup) దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి. సాధ్యమైనంత వరకు వన్డేలు ఆడేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్షన్ కమిటీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ). హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని బాంబు పేల్చాడు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రూప్ స్టేజిలోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. వరుసగా గాయల బారీన పడుతోన్న బుమ్రాను ఇక పక్కకు పెట్టండి అంటూ సూచనలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పైన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. బౌలింగ్ ఎంపిక వ్యూహంలో.. అజిత్ అగార్కర్ దారుణంగా విఫలమవుతున్నాడని మండిపడ్డారు. టీమిండియా కు అవసరమైన ప్లేయర్లను సెలెక్ట్ చేయడం లేదని ఆగ్రహించారు. కొత్త కొత్త బౌలర్లను తీసుకువచ్చి టీం ఇండియాను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్లను తీసుకువచ్చి టీమిండియా మెడకు తగిలేస్తున్నారని ఆగ్రహించారు. వీళ్ళ వయసు 22 నుంచి 25 సంవత్సరాలు మాత్రమే ఉందని… దీంతో ఫ్యూచర్ స్టార్స్ అనే ట్యాగ్ వేసి రుద్దుతున్నారని మండిపడ్డారు. ఈ ముగ్గురు బౌలర్లతో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం వెళితే.. టీమిండియా బొక్క బోర్లా పడుతుందని హెచ్చరించారు. అక్కడి బౌన్సీ మైదానాలకు ఈ బౌలర్లు తట్టుకోలేరని తెలిపారు.
మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి సీనియర్లను అజిత్ అగార్కర్ ఎందుకు పట్టించుకోవడంలేదని వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. ఎన్నో రోజులుగా జాతీయ జట్టులోకి వచ్చేందుకు దేశీయ క్రికెట్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ వాళ్లను సెలెక్టరు పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురు బౌలర్లను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బూమ్రా కు ఎలాగు గాయాలు అవుతున్నాయి… అతని పక్కన పెడితే బెటర్ అన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా ఆడేది కష్టమేనని తెలిపారు. అదే సమయంలో అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను తీసుకోవాల్సిందేనని తెలిపారు వీరేంద్ర సెహ్వాగ్.