MS Dhoni : భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రతీ సంవత్సరం తన ఫాం హౌస్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటాడు. వాస్తవానికి ధోనీ బర్త్ డే జులై 07, ఆయన భార్య సాక్షి బర్త్ డే జులై 04 ఒకే నెలలో కేవలం మూడు రోజుల వ్యవధిలో ఉండటం విశేషం. ఇవాళ ధోనీ రాంఛీలో ఉన్న ఫాం హౌస్ వద్దకు చేరుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను జరుపుకుందామని భార్య సాక్షితో కలిసి అక్కడికి వచ్చాడు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో చూస్తూ గూస్ బంప్స్ రావాల్సిందే.. సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.
ధోనీకి ఫ్యాన్స్ బర్త్ డే విషెస్..
ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి అభిమానులను చూసిన ధోనీ, సాక్షీ లు ఒక్కసారిగా నోరు మూసుకున్నారు. ఫ్యాన్స్ మాత్రం ధోనీ అన్న హ్యాపీ బర్త్ డే అంటూ విషెష్ చెప్పారు. కారులో అక్కడికి వస్తుండగానే అభిమానులు కారు చుట్టూ భారీగా గుమికూడారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం విశేషం. ఇక అంతకంటే ముందే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తన 44వ పుట్టిన రోజును సాదాసీదాగా జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పినప్పటికీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు కెప్టెన్ కూల్. పుట్టిన రోజు వేడుకల సందడికి దూరంగా, స్నేహితుల మధ్యనే సరదాగా జరుపుకున్నారు. కేకట్ కట్ చేసి, స్నేహితులకు తినిపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ధోనీ స్లీవ్ లెస్ బనియన్, షార్ట్ తో కూల్ గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంఎస్ ధోనీకి ఏడు నెంబర్ తో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. తన జెర్సీ నెంబర్ 07, పుట్టిన రోజు కూడా జులై 07 కావడం విశేషం.
ఐసీసీ 3 ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం జులై 07న 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. తన పదహారేళ్ల క్రికెట్ జర్నీలో మిస్టర్ కూల్.. భారత్ కి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి అభిమానుల మదిలోనూ చిరస్థాయిగా నిలిచాడు. ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు బర్త్ డే విషేష్ చెప్పారు. భారత క్రికెట్ కి అతను అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇండియన్ క్రికెట్ హిస్టరీని తిరగరాసిన ధోనీ కి తన సహచర క్రికెటర్లతో పాటు కోట్లాది మంది అభిమానులు బర్త్ డే విషెస్ చెప్పారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకిఅడుగుపెట్టిన ధోనీ తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయినా.. ఆ తరువాత జట్టులో కీలకమైన ఆటగాడిగా.. తిరుగులేని ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2007లో కెప్టెన్ బాధ్యతలు తీసుకొని జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. కెప్టెన్ గా భారత్ కి 2007లో టీ-20 వరల్డ్ కప్, 2011ల వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. వరల్డ్ క్రికెట్ లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోనీ నిలిచాడు.
?igsh=eThxems2anVkNTVi