Surya Kumar Yadav : సాధారణంగా సినీ సెలబ్రిటీలకు, క్రికెటర్లకు మధ్య ఏదో అవినావ సంబంధం ఉందని చాలా మంది అంటుంటారు. అది సహజమే. తాజాగా ఓ నటి టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెన్షేషన్ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె మరెవ్వరో కాదండోయ్.. నిత్యం తన బోల్డ్ లుక్స్ తో , వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి ఖుషీ ముఖర్జీ. సూర్య తనకి మెస్సెజ్ లు చేసేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుకోవడం లేదని.. గతంలో తనకు సూర్య తరుచూ మెసెజ్ చేశావాడని తెలిపారు. ఏ క్రికెటర్ తోనైనా డేటింగ్ చేయాలని ఉందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు తన వెనుక చాలా మంది పడుతున్నారని.. కానీ తాను ఎవ్వరితో కూడా అసోసియేట్ అవ్వాలనుకోవడం లేదని చెప్పింది.
Also Read : MS Dhoni : ధోని కారులో సిగరెట్… సాక్షి స్మోక్ చేస్తుందా!
అయితే ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ ముఖర్జీకి క్రికెటర్ల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందించింది. చాలా మంది క్రికెటర్లు తనతో టచ్లో ఉండటానికి ప్రయత్నిస్తారని.. గతంలో సూర్యకుమార్ యాదవ్ కూడా తనకు తరచుగా మెసేజ్లు చేసేవాడని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం తనకి సూర్యకి మధ్య ఎలాంటి సంబంధం లేదని, అసలు ఎవరితోనూ లింక్-అప్ పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని ఖుషీ స్పష్టం చేసింది. అనవసరమైన రూమర్లు వస్తాయనే ఉద్దేశంతోనే తాను ఎవరితోనూ మాట్లాడటం లేదని ఆమె చెప్పుకొచ్చింది. కోల్కతాకు చెందిన ఖుషీ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో పాటు దొంగ ప్రేమ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా టీవీ రియాలిటీ షోల ద్వారా ఈమె పాపులర్ అయింది.
ముఖ్యంగా ఎమ్టీవీలో వచ్చే స్ప్లిట్స్విల్లా 10, లవ్ స్కూల్ 3 వంటి షోలలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత బాల్వీర్ రిటర్న్స్ వంటి సీరియళ్లలోనూ నటించి మెప్పించింది. ఖుషీ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ అని, అలాంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడానికి ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్న గిమ్మిక్కు అని కొందరు కొట్టిపారేస్తుంటే, నిజంగానే సూర్య మెసేజ్ చేశాడా? అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఖుషీ తన బోల్డ్ వెబ్ సిరీస్ల వల్ల పలుమార్లు ట్రోలింగ్కు గురైంది. ఏదేమైనా ఇప్పుడు స్కై పేరును లాగడంతో ఈ ఇష్యూ నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read : INDW Vs SLW : నేడు భారత్-శ్రీలంక మధ్య ఐదో టీ20.. చివరి మ్యాచ్ లో గెలిచేది ఎవరో..?