T20 World Cup 2026: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 world cup 2026) నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC). బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు (Bangladesh Cricket Board)
సంబంధించిన పెద్దలతో సమావేశం నిర్వహించింది ఐసిసి. ఈ సందర్భంగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇండియాలో పర్యటించి, టి20 ప్రపంచకప్ ఆడాల్సిందేనని బంగ్లాదేశ్ కు ఆదేశాలు ఇచ్చిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాలక మండలి. అయితే ఐసీసీ ప్రతిపాదనలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board)
తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఐసీసీ పెద్దలు చాలా సీరియస్ అయ్యారట. మా దగ్గర డ్రామాలు ఆడకండి… ఎక్కువ చేస్తే తోక కట్ చేస్తాం, మేం తలుచుకుంటే మీరు బిచ్చగాళ్ళు అవుతారు అంటూ హెచ్చరించిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 మందికి పైగా హిందువులపై దాడులు జరగగా కొంతమంది మరణించారు. వారానికి ఒకరు మరణిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో కేకేఆర్ జట్టు కొనుగోలు చేసిన 9 కోట్ల ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను అయిపోయిన 2026 టోర్నమెంట్ ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ.
దీంతో ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై తమ దేశంలో బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. దీంతో పదివేల కోట్ల వరకు బిసిసిఐకి నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో తమ జట్టు పర్యటించబోదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మొండిపట్టు పట్టి కూర్చుంది. తమ వేదికలు మార్చాలని డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ లేదా శ్రీలంకలో అది కుదరకపోతే దుబాయిలో తమ మ్యాచ్ లు నిర్వహించాలని స్పష్టం చేస్తోంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తాము చెప్పినట్లు వినకపోతే , మ్యాచ్ ఫీజులు కట్ చేస్తామని ఐసిసి వార్నింగ్ ఇచ్చిందట. ఐసీసీ ద్వారా వచ్చే ఆర్థిక నిధులు ఆపేస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ క్రికెటర్లు బిచ్చం అడుక్కోవాల్సిందే అంటూ ICC బాస్ జై షా కూడా హెచ్చరించారట. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెటర్లతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో ఇండియాలో పర్యటించేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
🚨 BANGLADESH CRICKETERS TO LOSE MATCH FEES 🚨
– BCB insist no financial hit to if Bangladesh skip T20 World Cup 🤑
– The BCB chairman said the players stand to lose out on match fees and that they won't be compensated by the BCB 😲
– What's your take🤔pic.twitter.com/DSTvlgWfXJ
— Richard Kettleborough (@RichKettle07) January 15, 2026