E-Paper
Advertisement

India-Pakistan Match: ఇండియా-పాక్ మ్యాచ్…150 కోట్ల మంది చూశారు !

India-Pakistan Match: ఇండియా-పాక్ మ్యాచ్…150 కోట్ల మంది చూశారు !

India-Pakistan Match: 1.50 లక్షల మందితో అహ్మదాబాద్ స్టేడియం కిటకిట
ఒక్కరోజులో రూ.150 కోట్ల ఆదాయం. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగకన్నా ఎక్కువ. దాయాదుల పోరుని ఎంతో ఉత్కంఠతో, నరాలు తెగేంత టెన్షనుతో చూస్తుంటారు.

ప్రతి బాల్, ప్రతి పరుగు కూడా టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది. బౌలర్ పరుగెత్తే దగ్గర నుంచి వేసే వరకు, బ్యాట్స్ మెన్ కొట్టేవరకు ఊపిరి బిగపట్టి చూస్తుంటారు.
అంత ఉత్కంఠభరితంగా ఉంటుందని భావించి మ్యాచ్ ని ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది చూశారని ఒక అంచనా…

ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా-పాక్ దాయాదుల పోరు జరిగింది. మ్యాచ్ చూసేందుకు సుమారు 1.50 లక్షల మంది హాజరయ్యారు. స్టేడియమంతా కిటకిటలాడింది. మరోవైపు ఈ మ్యాచ్ కొందరికి కాసుల వర్షం కురిపించింది.

మీడియా లెక్కల ప్రకారం ఈ మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న డిస్నీ-హాట్ స్టార్ కేవలం ప్రకటనల ద్వారా రూ.150 కోట్ల వ్యాపారం చేశారని అంచనా. నాలుగేళ్ల క్రితం వరల్డ్ కప్ లో జరిగిన పాక్-ఇండియా మ్యాచ్ లో వచ్చిన దానికంటే రూ.50 కోట్లు అదనంగా సంపాదించిందని అంటున్నారు. ఇతర మ్యాచ్ లకన్నా దాయాదుల మ్యాచ్ కి ప్రకటనలకు రెట్టింపు వసూలు చేస్తారని అంటున్నారు. ఉదాహరణకి ఇతర జట్ల మ్యాచ్ ల్లో 10 సెకన్ల యాడ్ కి రూ.18 లక్షలు తీసుకుంటే, ఇండియా-పాక్ మ్యాచ్ కి మాత్రం రూ.36 లక్షల వరకు తీసుకుంటారంట. మరి ఇండియా- పాక్ ఆటా-మజాకానా…చూస్కోండి మరి…

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×