E-Paper
Advertisement

Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!

Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!
Advertisement

Pant Fifty: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదవ టెస్ట్ లోని రెండవ రోజు ఆట రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి భారత జట్టుకు నాలుగు పరుగుల స్వల్ప ఆదిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మరోసారి తడబడింది.

Also Read: Jasprit Bumrah Injury: టీమిండియాకు షాక్‌.. బుమ్రాకు గాయం..ఆస్పత్రికి తరలింపు !

Advertisement

ఒపెనర్లు యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13) తొలి వికెట్ కి 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ ఇద్దరు ఓపినర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఇక గిల్ (13) పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బలహీనతకే అవుట్ కావడం గమనార్హం. కేవలం 6 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్ లో ఉన్న స్మిత్ కి క్యాచ్ ఇచ్చాడు.

దీంతో తనని తానే తిట్టుకున్నాడు కోహ్లీ. ఫ్రస్టేషన్ లో గట్టిగా అరిచాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ ఝలిపించాడు. టి-20 తరహాలో సిక్సర్లు, ఫోర్లతో ఆసీస్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతులలో హఫ్ సెంచరీ పూర్తి చేశాడు పంత్. ఇందులో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా 32 బంతులలో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Advertisement

దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ ని 61 పరుగుల వద్ద కమీన్స్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 141 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ప్రస్తుతం 145 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (8*), వాషింగ్టన్ సుందర్ (6*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, వెబ్ స్టర్ 1, కమీన్స్ 1 వికెట్లు పడగొట్టారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 29 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన రిషబ్ పంత్ రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 2022లో శ్రీలంకపై 28 బంతులలో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు పంత్.

Also Read: Rohit sharma Retirement: నేను పిచ్చోన్నికాదు…రిటైర్మెంట్‌ పై రోహిత్‌ సంచలన ప్రకటన !

ఇప్పుడు మరోసారి 29 బంతుల్లో హఫ్ సెంచరీ పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచాడు కపిల్ దేవ్. 1982లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ ఇంగ్లాండ్ పై 2021లో 31 బంతులలో హాఫ్ సెంచరీ, 2024 లో యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ పై 31 బంతులలో హాఫ్ సెంచరీ చేశాడు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×