BigTV English
Advertisement

Ind vs Eng 3rd ODI: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..షమీతో పాటు మరో ఇద్దరు ఔట్

Ind vs Eng 3rd ODI: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..షమీతో పాటు మరో ఇద్దరు ఔట్

Ind vs Eng 3rd ODI: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య… ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే t20 సిరీస్ గెలిచిన టీమిండియా… వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. వరుసగా రెండు వన్డేలు గెలిచిన రోహిత్ శర్మ సేన… చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… ఇంగ్లాండ్ పై సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఇరుజట్ల మధ్య ఇవాళ మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో… మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న… ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ వన్డేలో… కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది.


ALSO READ: Matthew Kuhnemann: బౌలింగ్ యాక్షన్ లో అనుమానాలు.. ఆస్ట్రేలియన్ బౌలర్ మాథ్యూపై నిషేధం !

అయితే ఇందులో… టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయబోతుంది. ఈ మేరకు ఇంగ్లాండు కెప్టెన్ జోస్ బట్లర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండు వన్డేలో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్… చివరి వన్డేలో కూడా టాస్ నెగ్గి… చివరికి బౌలింగ్.. తీసుకోవడం జరిగింది. ఎలాగైనా చివరి వన్డే మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ చూస్తోంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది రోహిత్ శర్మ సేన. అయితే చివరి వన్డే మ్యాచ్ లో యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందులో భాగంగానే ఏకంగా ముగ్గురిని… రెస్ట్ మూడ్లోకి పంపాడు.


మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ఇలా ముగ్గురు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ మరో ముగ్గురిని తీసుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు అలాగే ఒక ఫాస్ట్ బౌలర్ ను రంగంలోకి దింపాడు రోహిత్ శర్మ. మొదటి రెండు వన్డేలు ఆడని అర్షదీప్ సింగ్… మూడవ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ తో పాటు కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లు యధావిధిగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కు అవకాశం ఇవ్వబోరని ప్రచారం జరిగింది. కానీ చివరికి అతనికి అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ. రిషబ్ పంత్ ను అలాగే డగౌట్ లో ఉంచారు. కాగా ఇప్ప్పటికే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది టీమిండియా.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బిగ్ స్కెచ్.. 5 గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా..!

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×