E-Paper
Advertisement

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?

IND VS NZ 1st Odi:  ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్  ( IND VS NZ 1st Odi) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ శవపేటిక నుంచి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన కొంత మంది నెటిజెన్స్… రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వడోదరకు వస్తే , ఇలా శవపేటికలోకి పంపిస్తారా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి ఒకే శవపేటిక పెట్టడం ఏంటి? అని మరికొంతమంది పరువు తీస్తున్నారు. శవపేటిక ఇచ్చి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పరువు తీసారని మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి శవపేటిక ?

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న ప్రారంభమైన మొదటి వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మతో ( Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను తమ స్టైల్ లో సన్మానించింది BCA స్టేడియం యాజమాన్యం. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఓ బాక్స్ తయారు చేయించి, వాళ్ల చిత్రాలను దానిపై వేశారు. ఇక మ్యాచ్ ప్రారంభం కాగానే ఆ బాక్స్ లో నుంచి విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ అరుదైన గౌరవాన్ని కొంతమంది కించపరుస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లకు శవపేటిక తయారుచేసి ఇచ్చారని ఫైర్ అవుతున్నారు.

అసలు ఆ శవపేటిక ఎందుకు ఏర్పాటు చేశారంటే ?

రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కోసం తయారు చేసింది శవపేటిక కాదు. అదొక ప్రత్యేక గౌరవం. 15 సంవత్సరాల తర్వాత వడోదర స్టేడియంలో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ నిన్న జరిగింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మొదటిది. అలాగే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడిన నేపథ్యంలో 8 నిమిషాలలో 35 వేల టికెట్లు సేల్ జరిగాయి. ఇలా జరగడం రికార్డు. ఇదే తొలిసారి. అందుకే ప్రత్యేకంగా ఓ బాక్స్ క్రియేట్ చేసి… అందులో నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్వాగతం పలికింది BCA స్టేడియానికి సంబంధించిన బృందం. కానీ ఇది అర్థం చేసుకొని కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ను శవపేటికలో ప‌డుకోబెట్టార‌ని ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×