E-Paper
Advertisement

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?
Advertisement

IND VS NZ 1st Odi:  ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్  ( IND VS NZ 1st Odi) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ శవపేటిక నుంచి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన కొంత మంది నెటిజెన్స్… రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వడోదరకు వస్తే , ఇలా శవపేటికలోకి పంపిస్తారా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి ఒకే శవపేటిక పెట్టడం ఏంటి? అని మరికొంతమంది పరువు తీస్తున్నారు. శవపేటిక ఇచ్చి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పరువు తీసారని మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి శవపేటిక ?

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న ప్రారంభమైన మొదటి వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మతో ( Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను తమ స్టైల్ లో సన్మానించింది BCA స్టేడియం యాజమాన్యం. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఓ బాక్స్ తయారు చేయించి, వాళ్ల చిత్రాలను దానిపై వేశారు. ఇక మ్యాచ్ ప్రారంభం కాగానే ఆ బాక్స్ లో నుంచి విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ అరుదైన గౌరవాన్ని కొంతమంది కించపరుస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లకు శవపేటిక తయారుచేసి ఇచ్చారని ఫైర్ అవుతున్నారు.

అసలు ఆ శవపేటిక ఎందుకు ఏర్పాటు చేశారంటే ?

రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కోసం తయారు చేసింది శవపేటిక కాదు. అదొక ప్రత్యేక గౌరవం. 15 సంవత్సరాల తర్వాత వడోదర స్టేడియంలో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ నిన్న జరిగింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మొదటిది. అలాగే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడిన నేపథ్యంలో 8 నిమిషాలలో 35 వేల టికెట్లు సేల్ జరిగాయి. ఇలా జరగడం రికార్డు. ఇదే తొలిసారి. అందుకే ప్రత్యేకంగా ఓ బాక్స్ క్రియేట్ చేసి… అందులో నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్వాగతం పలికింది BCA స్టేడియానికి సంబంధించిన బృందం. కానీ ఇది అర్థం చేసుకొని కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ను శవపేటికలో ప‌డుకోబెట్టార‌ని ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×