IND VS NZ 4Th T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I ) మధ్య ఇవాళ నాలుగవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer ) ఛాన్స్ ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ తప్పిదం చేశాడని ఆకాశ్ చోప్రా ( Aakash Chopra ) సీరియస్ అయ్యారు. అలాగే పొగ మంచు ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయడం చాలా పెద్ద తప్పిదం అంటూ ఫైర్ అయ్యారు. విశాఖ గ్రౌండ్ లో సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఓడిపోతారని కూడా చురకలు అంటించారు. గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశాడు ఆకాశ్ చోప్రా.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగోవ టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ సందర్భంగా టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. శ్రేయాస్ అయ్యర్ కు ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో అవకాశం రాలేదు. ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియాలో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ ను తొలగించిన సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం ఇస్తే సరిపోయేది కదా ? అని కౌంటర్ ఇస్తున్నారు.అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ను ఇషాన్ కిషన్ స్థానంలో తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మూడు లేదా నాలుగు స్థానాలలో శ్రేయాస్ అయ్యారు అద్భుతంగా ఆడేవాడని.. ఇప్పుడు అతనికి అవకాశం ఇవ్వకుండా బౌలర్ కు అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ప్రశ్నించారు. శ్రేయాస్ అయ్యర్ కు ఈ మ్యాచ్ లో అవకాశం ఇస్తే బాగుండేదని.. ఈ కుట్రలన్నీ గౌతమ్ గంభీర్ వే అని మండిపడ్డారు. ఒకవేళ ఈ నాలుగవ టి20 లో టీం ఇండియా ఓడిపోతే దానికి కారణం గౌతం గంభీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఫైర్ అయ్యారు. మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు ఆకాశ్ చోప్రా.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
Aakash Chopra feels India missed a trick by not including Shreyas Iyer and by not batting first despite dew being a factor#AakashChopra #ShreyasIyer #IndianCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/SzRviOYaop
— InsideSport (@InsideSportIND) January 28, 2026