E-Paper
Advertisement

IND VS NZ 5th T20: అర్ష‌దీప్ కు 5 వికెట్లు..వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం

IND VS NZ 5th T20: అర్ష‌దీప్ కు 5 వికెట్లు..వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం
Advertisement

IND VS NZ 5th T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం రోజున ఐదవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ ఐదవ టి20 మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేయడమే కాకుండా, న్యూజిలాండ్ ను కట్టడి చేసింది. ఈ తరుణంలోనే చిట్ట చివరి టీ20 మ్యాచ్ ఏకంగా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇండియా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన న్యూజిలాండ్, 19.4 ఓవ‌ర్లు ఆడి, 225 ప‌రుగులు మాత్ర‌మే సాధించి ఓడింది. ఈ త‌రుణంలోనే 4-1 తేడాతో 5 టీ20ల సిరీస్ కూడా కైవ‌సం చేసుకుంది సూర్య కుమార్ యాద‌వ్ సేన‌. ఈ భారీ విజ‌యంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో అడుగుపెట్ట‌నుంది టీమిండియా.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో ఇండియా బ్యాటింగ్ మొదట చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా, 271 పరుగులు సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా బాగానే ఆడింది. 19.4 ఓవర్లు ఆడింది న్యూజిలాండ్. ఈ నేపథ్యంలోనే 225 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది న్యూజిలాండ్. దీంతో 46 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చాలా ప్రమాదకరంగా ఈ మ్యాచ్ లో ఆడాడు. ఒకానొక సమయంలో అతడు మ్యాజిక్ గెలిపిస్తాడని కూడా అందరూ అంచనా వేసుకున్నారు. కేవలం 38 బంతులు వాడిన ఫిన్ అలెన్ 80 పరుగులు సాధించాడు. అయితే అతన్ని అక్షర్ పటేల్ అవుట్ చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు.

ఐదు వికెట్లతో ఇరగదీసిన అర్షదీప్ సింగ్‌

న్యూజిలాండ్ పై జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో డేంజర్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదట భారీగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్, ఆ తర్వాత ఐదు వికెట్లు పడగొట్టగలిగాడు. నాలుగు ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ 51 పరుగులు ఇవ్వడమే కాకుండా ఐదు వికెట్లు తీసి ఇండియాకు విజయాన్ని అందించాడు. దీంతో అర్షదీప్ సింగ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ద‌క్కింది. అటు గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి అలాగే రింకు సింగ్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×