E-Paper
Advertisement

IND VS PAK: టీమిండియాకు ఆడిన పాక్ ప్లేయర్… ఇండియన్ జెర్సీ వేసుకుని మ‌రీ

IND VS PAK: టీమిండియాకు ఆడిన పాక్ ప్లేయర్… ఇండియన్ జెర్సీ వేసుకుని మ‌రీ

IND VS PAK:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. కాశ్మీర్ ప్రాంతం కారణంగా ఈ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు పాకిస్తాన్ వాడు సహాయం చేస్తే ఎలా ఉంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా కచ్చితంగా ఈ అంశం హాట్ టాపిక్ కావడం గ్యారెంటీ. అయితే అచ్చం అలాంటి సంఘటనే తాజాగా ఒకటి జరిగింది. పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ ప్లేయర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. బహ్రెయిన్‌ దేశంలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో భారత జట్టు తరుపున పాకిస్తాన్ కబడ్డీ ఆటగాడు ఆడి వివాదానికి తెరలేపాడు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

భారత జట్టుకు ఆడిన పాకిస్తాన్ ప్లేయర్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ కబడ్డీ ప్లేయర్ వివాదానికి తెర లేపాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) ఇండియా జట్టు తరఫున ఆడి పెంట పెంట చేశాడు. బహ్రెయిన్‌ దేశంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మన ఇండియాకు సంబంధించిన జెర్సీని ధరించి, జెండాను కూడా ఎగరవేశాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ ( Pakistan Kabaddi Federation ) సీరియస్ అయింది. పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ పై విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చింది. బోర్డు అనుమతి లేకుండా విదేశీ మ్యాచ్ ల‌లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే.

అందులోనూ ఇండియాకు ( Team India) ఆడడం దేశానికి ద్రోహం చేసినట్లే అంటూ పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రటరీ రాణా సర్వార్ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ తగ్గడం లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఫెడరేషన్ వెల్లడిస్తోంది. పాకిస్తాన్ జాతీయ గౌరవాన్ని అవమానించి ఇండియాకు వాడడం దేశద్రోహమే అని పేర్కొంటోంది. దీని కచ్చితంగా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్. ప్రాథ‌మికు స‌మాచారం మేర‌కు ఇండియాకు ఆడిన పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) పై క‌ఠిన శిక్ష ప‌డే ప్ర‌మాదం ఉంది. అతడు ఇక క‌బ‌డ్డీ ఆడ‌కుండా వేటు వేయ‌నున్నారు.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×