E-Paper
Advertisement

IND-W vs SA-W : ఆదుకున్న రిచా ఘోష్..టీమిండియా ఆలౌట్‌, ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

IND-W vs SA-W : ఆదుకున్న రిచా ఘోష్..టీమిండియా ఆలౌట్‌, ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

IND-W vs SA-W :   ఐసీసీ మ‌హిళ‌ల‌ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 9 మ్యాచ్ లు పూర్తిగా గాక ఇవాళ 10వ మ్యాచ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైట్ జరుగుతోంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కాస్త తడబడింది. అయితే ఆ తర్వాత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుతంగా రాణించి, టీమిండియాను ఆదుకున్నారు. 94 ప‌రుగులు చేసి ఔట్ అయింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ లో 252 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా గెలుస్తుంది.

Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో ప‌ర్మిష‌న్‌…దుబాయ్ లో వ‌దిలేశాడుగా !

టీమిండియాను ఆదుకున్న రీఛార్జ్ ఘోష్ ( RICHA GHOSH )

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్ రీఛార్జ్ ఘోష్ రెచ్చిపోయింది. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకుంది. దీంతో 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసింది టీమిండియా. అయితే మొదట్లో టీమ్ ఇండియా కాస్త తడబడినా, ఆ తర్వాత సెటిల్ అయింది. టీమిండియా వికెట్ కీపర్ రీఛార్జ్ ఘోష్ 77 బంతుల్లో ఏకంగా 94 పరుగులతో రెచ్చిపోయింది. సెంచరీ మిస్ చేసుకున్నా, జట్టుకు అమూల్యమైన పరుగులు అందించింది. రీఛార్జ్ ఘోష్ కు ( RICHA GHOSH ) స్నేహ రాణా అండగా నిలిచి 33 పరుగులు చేసింది. దీంతో టీమిండియా మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో జెమిమా రో డ్రిగ్స్ ( Jemimah Rodrigues ) క్రాంతి గౌడ్, శ్రీ చరణ్ సున్న పరుగులకే వెనిదిరిగారు. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో స్నేహ రాణా అద్భుతంగా రాణిస్తున్నారు. చివరలో వచ్చి జట్టును ఆదుకుంటున్నారు. శ్రీలంకపై 28 పరుగులు, పాకిస్తాన్ పై 20 పరుగులు అలాగే సౌత్ ఆఫ్రికా పై 33 పరుగులు చేసి జట్టుకు అమూల్యమైన సహాయం చేశారు స్నేహ రాణా.

సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మందాన ( Smriti Mandhana )

మహిళల మండే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో స్మృతి మందాన ( Smriti Mandhana ) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది స్మృతి మందాన. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్ ప్లేయర్ క్లాక్ 1997 సంవత్సరంలో ఏడాది మొత్తంగా 970 పరుగులు చేసింది. అయితే ఈ 2025 సంవత్సరంలో 973 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది స్మృతి మందాన. 2024 లో కూడా ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ ఆ సమయంలో 800 కంటే తక్కువ పరుగులు చేసింది.

Also Read: Rohit Sharma: గంభీర్ వ‌ల్ల ఒరిగిందేమీ లేదు, ద్రావిడ్ వ‌ల్లే ఛాంపియన్స్ ట్రోఫీ..ఇజ్జ‌త్ తీసిన రోహిత్ శ‌ర్మ

 

 

Related News

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

Big Stories

×