Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చివరి దశకు వచ్చింది. ఆదివారం రోజున వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs West Indies ) మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ ) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని బాంబు పేల్చారు. టీమిండియా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత వెంటనే ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగంలోకి దిగాడని ఆరోపణలు చేశారు. ఆయన ఫోన్ చేసి, వెస్టిండీస్ ప్లేయర్లను బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వెళ్లిపోయిందని ఇంజమామ్ వుల్ హక్ కారు కూతలు కూసాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈనెల 5వ తేదీన సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అందులో గెలిస్తే ఫైనల్ ఉంటుంది. అయితే టీమిండియా సెమీఫైనల్ వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే జై షా రంగంలోకి దిగి స్టేడియం అధికారులకు ఫోన్ చేశాడని వెల్లడించారు.
అలాగే జింబాబ్వే ప్లేయర్లను భయపెట్టించాడని.. డబ్బులతో వాళ్లను కొనేశాడని బాంబు పేల్చాడు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కారణంగానే టీమిండియా గెలిచిందని వెల్లడించాడు. లేకపోతే 195 పరుగుల లక్ష్యాన్ని చేదించడం ఇండియా వల్ల కాకపోయేదని విమర్శలు చేశారు. ఫిక్సింగ్ జరగడం వల్లే టీమిండియా సెమీ ఫైనల్ కు చేరిందని ఫైర్ అయ్యారు. దీనిపై ఐసీసీని వివరణ కోరుతానని ఇంజమామ్ ఉల్ హక్ వెల్లడించారు. బీసీసీఐ చెప్పినట్లుగానే ఐసీసీ నడుచుకుంటోందని విమర్శలు చేశారు. ఇలా అయితే, క్రికెట్ ఆడటం కష్టమేనని మండిపడ్డారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ ). ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఇండియన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.
🚨 INZAMAM-UL-HAQ BLAMES JAY SHAH ON INDIA'S WIN VS WEST INDIES 🚨
Former Pakistan cricketer Inzamam-ul-Haq has made a shocking allegation regarding the India vs West Indies match.
In a TV interview, he said that when West Indies posted a big total of 195 runs, Team India… pic.twitter.com/35M3tXSZeU
— EPSN Cricket (@EPSNCricket) March 1, 2026