Telugu Commentators: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. వైభవ్ సూర్య వంశీ పేరు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ జట్టు పైన 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్య వంశీ. ఆ ఒక్క సెంచరీ వైభవ్ సూర్యవంశీ కెరీర్ మార్చేసిందని చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం కావడంతో జట్టులోకి 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుంటున్నాడు వైభవ్ సూర్య వంశీ.
Also Read: Jyoti Malhotra: బాబర్ ఆజంతో జ్యోతి మల్హోత్రాకు లింకులు.. అ**క్రమ సంబంధం పెట్టుకుని మరీ !
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీను ర్యాగింగ్ చేసిన తెలుగు కుర్రాడు
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని… తెలుగు కామెంట్రేటర్ గా విహారి.. దారుణంగా ట్రోలింగ్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఓ స్కూల్ పిల్లాడు అంటూ… చులకన చేసే ప్రయత్నం చేశాడు. ఆదివారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో… చివరి వరకు ఆడి… పోరాడి ఓడింది రాజస్థాన్ రాయల్స్.
అయితే జైష్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… అనవసర పరుగు కోసం వైభవ్ సూర్య వంశీ ప్రయత్నం చేశాడు. అయితే ఆ పరుగు వద్దని యశస్వి జైస్వాల్ తన అనుభవంతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ మాత్రం పట్టించుకోకుండా పరుగు తీశాడు. రన్ అవుట్ అయ్యేది జస్ట్ లో మిస్సయింది. అయితే ఆ సమయంలో విహారి కామెంట్రేటర్ గా ఉన్నాడు. తెలుగులో కామెంట్రి చేస్తూ తన నోటికి వచ్చింది వాగేశాడు. జైస్వాల్ చెప్పిన కూడా వినడం లేదని వైభవ్ సూర్యవంశీ పై ఫైర్ అయ్యాడు. అతడు 14 సంవత్సరాల… స్కూల్ పిల్లాడు అంటూ.. సెటైర్లు పేల్చడం మొదలుపెట్టాడు. దీంతో ఈ కామెంట్రీ విన్న జనాలు… ఆంధ్ర క్రికెటర్ అనుమ విహారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విహారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు అభిమానులు
విహారి నీకు ఆడటం చేతకాదు.. 14 ఏళ్ల కుర్రాడు వాడుతుంటే హేళన చేస్తావా? కొంచమైనా సిగ్గుందా అంటూ ఫైర్ అవుతున్నారు. స్కూల్ కుర్రాడు అయినా… నీ కన్నా బాగా క్రికెట్ ఆడుతున్నాడని చురకలు అందించాడు. సంజు స్థానాన్ని భర్తీ చేసి.. గడ్డలు తోపు ప్లేయర్ గా కొనసాగుతున్నాడని సెటైర్లు వేల్చుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా…. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో అయ్యర్ టీం విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్ కు నేరుగా వెళ్ళింది పంజాబ్ కింగ్స్.
ALSO READ: IPL 2025: ఆ మూడు జట్లను వణికిస్తున్న కావ్య పాప..SRH అంటే మాములుగా ఉండదు మరి !
?igsh=aGJiYmk5MXNmcXl0