E-Paper
Advertisement

2010 నుంచి 16 ఏళ్లుగా ఐపీఎల్ లోనే పాతుకుపోయాడు, 6 జ‌ట్లు మారాడు..ఇంత‌కు ఎవ‌రీ ప్లేయ‌ర్

2010 నుంచి 16 ఏళ్లుగా ఐపీఎల్ లోనే పాతుకుపోయాడు, 6 జ‌ట్లు మారాడు..ఇంత‌కు ఎవ‌రీ ప్లేయ‌ర్
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 20% మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇలాంటి క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) గురించి సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఐపీఎల్ ప్రారంభం అయిన నుంచి ఇప్పటి వరకు టోవర్నమెంట్ ఆడుతూనే ఉన్నాడు ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు మిచెల్ మార్ష్‌. డెక్కన్ చార్జెస్ నుంచి మొదలుకొని ఇప్పుడు లక్నో వరకు.. మొత్తం ఆరు జట్లు మారాడు. కానీ ఐపీఎల్ టోర్నమెంట్ కు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే డెక్కన్ చార్జర్స్ జట్టుకు మిచెల్ మార్ష్‌ ప్రాతినిధ్యం వహించిన పాత‌ ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవ‌ర‌బ్బా ఇత‌ను అంటూ సెర్చ్ చేస్తున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

2010 నుంచి 16 ఏళ్లుగా ఐపీఎల్ లోనే పాతుకుపోయాడు, 6 జ‌ట్లు మారాడు

Advertisement

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ అద్భుతమైన ఆటగాడు. అతని వయసు 34 సంవత్సరాలు. అయితే ఇంత వయసు వచ్చినా కూడా టి20లో అద్భుతంగా రాణిస్తూ దూసుకు వెళ్తున్నాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ గా కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే అలాంటి మిచెల్ మార్ష్‌ 2010 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ఆడుతున్నాడు మిచెల్ మార్ష్‌. అంటే 16 సంవత్సరాలుగా ఐపిఎల్ లోనే తిష్ట వేశాడు. తన 19వ ఏటా డెక్కన్ చార్జర్స్ తరఫున 2010 ఐపీఎల్ టోర్నమెంట్ లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పెద్దగా అవకాశాలు రాకపోయినా ఏ మాత్రం లైట్ తీసుకోలేదు. అనంతరం 2011 నుంచి 2013 వరకు పూణే వారియర్స్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జ‌ట్టు తరఫున కూడా తన ప్రదర్శన కనబరిచాడు.

ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ కు బ్రేక్ ఇచ్చిన మిచెల్ మార్ష్, 2020లో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. కానీ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక 2022 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొట్టాడు. 2025 నుంచి ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టు తరఫున ఆడుతున్నాడు మిచెల్ మార్ష్. ఈ పదహారేళ్ల సుదీర్ఘ ఐపిఎల్ లో 55 మ్యాచ్ లు ఆడాడు మిచెల్ మార్ష్. ఇందులో 1292 పరుగులు చేసిన మార్ష్, 37 వికెట్లు కూడా పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ పైన 117 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక మార్ష్ ను 3.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

Advertisement

 

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×