Irfan Pathan On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni ) గురించి నిత్యం నెగిటివ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు.. ఏదో ఒక రూపంలో మహేంద్ర సింగ్ ధోనీని విలన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల కెరీర్ నాశనం చేశాడంటూ మహేంద్ర సింగ్ ధోని పై అనేక అభండాలు వచ్చి పడ్డాయి. లేటెస్ట్ గా ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ పై ఆరోపణలు చేసిన ఇర్ఫాన్ పఠాన్, లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయాడు. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మహేంద్ర సింగ్ ధోని కారణంగానే తన కెరీర్ నాశనమైంది అంటూ బాంబు పేల్చారు. అతడి కెప్టెన్సీలో ఆడడం వల్లే, తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని వ్యాఖ్యానించారు. టాలెంట్ ఉన్నవాళ్లను తొక్కేశాడని ఫైర్ అయ్యారు. దీంతో మహేంద్ర సింగ్ ధోని పై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే తనను తొక్కేసారని ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా తాను అద్భుతంగా రాణించినప్పటికీ… న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో తనకు MS ధోని అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాంబు పేల్చారు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో పడింది. ఆ సమయంలో 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్ బ్రదర్స్ ఇద్దరు జట్టును ముందుండి నడిపించారు. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ 16 బంతుల్లోనే 33 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇంత మంచి ఇన్నింగ్స్ తర్వాత ఆ న్యూజిలాండ్ పర్యటనకు టీమిడియా వెళ్ళింది.
అక్కడ నాలుగు మ్యాచ్ లో ఇర్ఫాన్ పఠాన్ కు మహేంద్ర సింగ్ ధోని అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై అప్పటి కోచ్ గారీ క్రిస్టెన్ (Gary Kirsten)ను కూడా నిలదీశాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గారీ క్రిస్టెన్ కూడా చేతులెత్తేసాడని ఫైర్ అయ్యారు. టీమిండియా తుది జట్టు ఎంపిక తన చేతిలో ఉండదని… అంతా మహేంద్ర సింగ్ ధోని నిర్ణయమే అంటూ గారీ క్రిస్టెన్ చెప్పినట్లు ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించారు. దాంతో ధోని నిర్ణయాల వల్ల తన కెరీర్ నాశనం అయిందని అర్ధమైనట్లు వెల్లడించారు. తనకు నచ్చిన వాళ్ళను మాత్రమే జట్టులో ఉంచేవాడని ఆగ్రహించారు. ముఖ్యంగా హుక్కా ఏర్పాటు చేసిన వాళ్లకు టీమిండియాలో కచ్చితంగా అవకాశం వచ్చేదని ఇర్ఫాన్ మరోసారి గుర్తు చేశారు.