Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెటర్లపై భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్లు మైదానంలో ప్రణాళిక లేకుండా ఆడుతున్నారని హేళన చేస్తూ మాట్లాడారు. బుర్ర ఉపయోగించకుండా కేవలం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు నిజంగా గాడిదలు అంటూ అభిమానించారు గౌరవ్ ఆర్య. టీమిండియా జట్టుతో ఆడేటప్పుడు వీళ్ళ బుర్రలు అస్సలు పనిచేయవు అని… హేళన చేస్తూ మాట్లాడారు. అభిషేక్ శర్మను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
పాకిస్తాన్ క్రికెటర్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్స్ లలో టీమిండియాతో మ్యాచ్ లు ఆడేటప్పుడు దారుణంగా విఫలమవుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగితే.. పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న టి20 ప్రపంచ కప్ 2026, ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో కూడా దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు నిజంగా గాడిదల లాంటి వాళ్లు అంటూ రెచ్చిపోయారు. టీమిండియాను ఓడించే దమ్ము లేదు కానీ… అభిషేక్ శర్మ లాంటి కుర్ర క్రికెటర్లను స్లెడ్జింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు ఆవేశానికి వెళ్లి, విఫలమవుతున్నారన్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగి… పళ్ళు రాలగొట్టుకుంటున్నారని చురకలు అంటించారు. మరో 1000 జన్మలు ఎత్తినా అవేశంతో టీమిండియాను ఓడించలేరన్నారు.
పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వసీం అక్రమ్, వకార్ యూనిస్ , జాబ్ అయితే జావేద్ లియాందాద్ లాంటి గొప్ప క్రికెటర్లతో అభిషేక్ శర్మ ఫోటో దిగితే తప్పుగా ప్రచారం చేస్తున్నారని పాకిస్తాన్ క్రికెటర్ల పై మండిపడ్డారు భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య. వాళ్లతో ఫోటోలు దిగి.. సలహా సూచనలు అభిషేక్ శర్మ తీసుకున్నాడని వెల్లడించారు. అంతేకానీ పాకిస్తాన్ తో స్నేహం కోసం కాదని కౌంటర్ ఇచ్చారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా అభిషేక్ శర్మను డిస్టర్బ్ చేసేందుకు హరీస్ రౌఫ్ స్లెడ్జింగ్ చేశాడని గుర్తు చేశారు. అయితే స్లెడ్జింగ్ చేసినప్పటికీ కూడా అభిషేక్ శర్మ ( Abhishek sharma) ఏకాగ్రతతో మ్యాచ్ ఆడి.. పరుగులు రాబట్టాడని గుర్తు చేశారు. ఆవేశంతో కాకుండా, టీమిండియా ప్లేయర్ల లాగా ఆలోచించి పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ ఆడడం నేర్చుకోవాలన్నారు.