Sonakshi Unfollow Virat kohli Anushka: విరాట్ కోహ్లీ ( Virat kohli ), అనుష్క శర్మ ( Anushka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాను వదిలేసి లండన్ లో సెటిల్ అయిన ఈ జంట.. అక్కడి పౌరసత్వాన్ని కూడా సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. సమయం దొరికినప్పుడు లేదు మూడు నెలలకు ఒకసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చి, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, బృందావన్ లాంటి పవిత్ర స్థలాలకు వెళ్లి సందడి చేస్తూ ఉంటారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు. అంతేకాదు, వాళ్లు తిరిగిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే, ఇండియాలో జాలీగా గడుపుతున్న విరాట్ కోహ్లీ దంపతులపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా బాంబు పేల్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అకౌంట్లను అన్ ఫాలో చేసింది. ఇద్దరికీ హిందుత్వం తప్ప.. దేశం గురించి ఏ మాత్రం ఆలోచన లేదని ఫైర్ అయ్యింది.
దేశ వ్యాప్తంగా మొన్నటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, నిరుద్యోగులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీకైన సంఘటనలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ రోడ్డు ఎక్కారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులతో పాటు విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. అయినప్పటికీ నిరుద్యోగుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వాళ్ల సమస్యల పరిష్కారానికి ఓ బిల్లు కూడా పార్లమెంట్ లో పెట్టింది మోడీ ప్రభుత్వం. అటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంత జరుగుతున్న విరాట్ కోహ్లీ, ఆయన భారీ అనుష్క శర్మ మాత్రం చీమ కుట్టినట్లు వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా మండిపడింది. ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడ డబ్బులతో.. కోటీశ్వరులు అయిన వాళ్లు.. దేశ యువత గురించి పట్టించుకోవడంలేదని మండిపడింది. అందుకే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అకౌంట్లను అన్ ఫాలో చేసినట్లు చెబుతున్నారు. గుళ్ళు గోపురాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో తిరుగుతారు తప్ప… దేశాన్ని మాత్రం పట్టించుకోరని ఈ జంటపై ఫైర్ అయింది.
గతంలో వీళ్ళు అంటే ఎంతో అభిమానం ఉండేదని… కానీ ఇప్పుడు అది పోయిందని ఆగ్రహించింది. మహమ్మద్ షమీ విషయంలో విరాట్ కోహ్లీ అండగా నిలిచాడని… ఆ సందర్భంగా కోహ్లీ అంటే తనకు అభిమానం పెరిగినట్లు గుర్తు చేసింది. మహమ్మద్ షమీ గురించి అండగా నిలిచిన విరాట్ కోహ్లీ… విద్యార్థుల గురించి ఎందుకు నిలబడలేదని ప్రశ్నించింది. భారతదేశంలో ఏ సమస్యలు వచ్చిన విరాట్ కోహ్లీ దంపతులు బాధితుల పక్షాన ఉండాల్సిందేనని ఆగ్రహించింది. ఇకపై ఈ ఇద్దరినీ తాను ఫాలో కానని స్పష్టం చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.