Ishant Sharma On MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) మిస్టర్ కూల్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి వివాదాలు లేకుండా టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడు మన మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోనిపై చాలామంది మాజీ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) హాట్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదని.. అతడికి పొగరెక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీతో పాటు తనను కూడా బండ బూతులు తిట్టాడని వెల్లడించారు. 2013 ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా తాను సరిగ్గా ఫీల్డింగ్ చేయనందుకు తనను బూతులు తిట్టినట్లు గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ కూడా అనవసర షాట్ ఆడినందుకు కూడా ఫైర్ అయినట్లు వెల్లడించారు. ఇలా రెండు సందర్భాలలో విరాట్ కోహ్లీ, తాను ధోని ఆగ్రహానికి గురైనట్లు గుర్తు చేశారు ఇషాంత్ శర్మ.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ప్రపంచంలోనే మహేంద్ర సింగ్ ధోని గొప్ప కెప్టెన్ అని ప్రశంసించారు. అయితే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మహేంద్ర సింగ్ ధోని.. కొన్ని సమయాలలో సీరియస్ గా వ్యవహరిస్తాడని వివరించారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను కూడా ఇషాంత్ శర్మ గుర్తు చేశాడు. ఆ ట్రోఫీ సందర్భంగా తాను బౌండరీ గేట్ దగ్గర మిస్ ఫీల్డ్ చేశానని వివరించాడు. ఈ క్రమంలో తనను ధోని తిట్టినట్లు వివరించారు. అక్కడ నిలబెట్టింది.. బంతి పట్టడానికి తప్ప.. సినిమా చూడడానికి కాదంటూ ఫైర్ అయినట్లు వివరించారు.
అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ అనవసరమైన భారీ షాట్ ఆడాడని గుర్తు చేశారు. ఆ షాట్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అనవసరంగా అవుట్ అయ్యాడని పేర్కొన్నారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీని ధోని కోప్పడ్డాడని వెల్లడించారు. జట్టులో బ్యాటర్లు తక్కువగా ఉన్నారని తెలిసి కూడా అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది ? అంటూ కడిగిపారేసాడు అంట ధోని. అంటే ఇషాంత్ శర్మ చెప్పిన ప్రకారం ధోని ఊరికే కోపానికి రాడు.. సభ్యులు తప్పిదం చేస్తేనే ఆగ్రహిస్తాడు అన్నమాట. ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు అన్నీ కూడా ధోనికి ఉన్న నేపథ్యంలోనే అతడు మిస్టర్ కూల్ అయ్యాడని ప్రశంసించారు ఇషాంత్ శర్మ.