Kapil Dev: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav sooryavanshi) గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ తో పాటు మొన్న శ్రీలంక లిస్ట్ ఏ జట్టుపై భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు వైభవ్. త్వరలోనే టి20 టీమిండియా జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ తో జరిగే టి20లో అతడు ఓపెనర్ గా కూడా బరిలోకి దిగుతాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
దీంతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ లో కూడా సెంచరీల మీద సెంచరీలు చేస్తాడని అందరు అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ అంచనాలపై ఒక్కసారిగా టీమిండియా వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ (Kapil Dev) నీళ్లు చల్లారు. వైభవ్ సూర్య వంశీపై అనవసరంగా అంచనాలు పెట్టుకోకూడదని… 20 నుంచి 22 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతనిపై ఒక అంచనాకు రావాలని కోరారు. అప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ గురించి డబ్బా కొట్టడం మానేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కపిల్ దేవ్. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
త్వరలోనే టీమ్ ఇండియా జట్టులోకి ( Team India) రాబోతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పై (Vaibhav sooryavanshi) వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ (Kapil Dev) హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే 16 సంవత్సరాలలో అడుగుపెట్టబోతున్న వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు అంటూ కపిల్ దేవ్ మెచ్చుకున్నారు. వైభవ్ లో ప్రస్తుతం అదిరిపోయే టాలెంట్ ఉంది… ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్నారు. కానీ వైభవ్ పైన అంచనాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి అని గుర్తు చేశారు. అనవసరంగా వైభవ్ పై అంచనాలు పెట్టుకోకూడదని… ఆ అంచనాలు ఒక్కసారిగా ఢమాల్ అవుతాయని హెచ్చరించారు.
వైభవ్ సూర్య వంశీ 20 నుంచి 22 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి.. బాగా ఆడితే, అతడిని మెచ్చుకోవాలన్నారు. కానీ ఇప్పటి సిక్సర్లు, బౌండరీలు, అతడు బాదే సెంచరీలను లెక్కలోకి తీసుకోకూడదని కోరారు. ఒకప్పుడు 16 సంవత్సరాలలోనే లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అద్భుతంగా రానించి… తన కెరీర్ పూర్తయ్యే వరకు నిలకడగా నిలదొక్కుకున్నాడని గుర్తు చేశారు. అతడి లాగా వైభవ్ ఆడతాడని ఏమాత్రం నమ్మకం పెట్టు కోకూడదని కోరారు. ఇప్పుడే అనవసరంగా సచిన్ టెండూల్కర్ తో వైభవ్ సూర్యవంశీని పోల్చకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కపి దేవ్. కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.