E-Paper
Advertisement

ఢిల్లీ కొంప‌ముంచిన కరుణ్ నాయర్..రెండు క్యాచ్ లు గంగ‌పాలు, పంజాబ్ రికార్డ్ విక్ట‌రీ

ఢిల్లీ కొంప‌ముంచిన కరుణ్ నాయర్..రెండు క్యాచ్ లు గంగ‌పాలు, పంజాబ్ రికార్డ్ విక్ట‌రీ
Advertisement

PBKS VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Delhi Capitals vs Punjab Kings) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణించాయి. ఈ మ్యాచ్ లో మొత్తం 500 కు పైగా పరుగులు నమోదు అయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ అవలీలగా ఆ లక్ష్యాన్ని చేదించింది. చివరలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే అర్ధ సెంచ‌రీ చేసిన‌ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ విక్టరీ అందుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణం కరుణ్ నాయర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుసగా రెండు క్యాచ్ ల‌ను వదిలేశాడు కరుణ్ నాయర్. ఈ దెబ్బకు రెచ్చిపోయిన శ్రేయాస్ అయ్యర్.. మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు విలన్ గా కరుణ్ నాయర్ తయారయ్యాడని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

ఢిల్లీ కొంప‌ముంచిన కరుణ్ నాయర్.. పంజాబ్ రికార్డ్ విక్ట‌రీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 150 కి పైగా పరుగులు సాధించాడు. అయితే ఇంత టార్గెట్ పెట్టినా కూడా పంజాబ్ కింగ్స్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 18.5 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది పంజాబ్ కింగ్స్. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 76 పరుగులు చేయగా ప్రియాంష్ ఆర్య 43 పరుగులతో రెచ్చిపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో ఊచకోత కోశాడు. ఈ దెబ్బకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో క‌రుణ్ నాయ‌ర్‌ పెద్ద తప్పిదం చేశాడు. శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేసిన క్రమంలో.. రెండు ఈజీ క్యాచులు ఇచ్చాడు. అయితే ఈ క్యాచ్ ల‌ను అందుకోవడంలో క‌రుణ్ నాయ‌ర్‌ విఫలమయ్యాడు. ఈ దెబ్బకు రెచ్చిపోయిన శ్రేయస్ అయ్యర్… పంజాబ్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కు విలన్ గా మారారని మండిపడుతున్నారు.

Advertisement

 

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

 

 

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×