Mohammad Kaif On Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ద్వారా డబ్బులు సంపాదించి లండన్ దొబ్బేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టుల్లో ఆడే సత్తా ఉన్నా కూడా… రిటైర్మెంట్ ఇచ్చి చేతకాని వాడిలాగా మిగిలిపోయాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహమ్మద్ కైఫ్. టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ అవసరం ఉందని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తాజాగా టెస్ట్ క్రికెట్ గురించి ఓ ఇంటర్వ్యూలో చర్చ జరగకగా… ఈ సందర్భంగా మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందని మహమ్మద్ కైఫ్ వెల్లడించారు. ఒకప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ చాలా బలంగా ఉండేదని… క్రమ క్రమంగా సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీక్ అవుతోందని వ్యాఖ్యానించారు. గౌతమ్ గంభీర్ లాంటి హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు. గౌతమ్ గంభీర్ హయాంలోనే దాదాపు ఏడుగురు క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారని గుర్తు చేశారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజంక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పూజారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రికెటర్లు గంభీర్ హయాంలోని రిటైర్మెంట్ ప్రకటించారని వివరించారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ లాంటి వాళ్లకు టీమిండియాలో మళ్లీ అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కూడా వాళ్లకు ఛాన్సులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అనుకూలంగా వ్యవహరించే వాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకొని గంభీర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కైఫ్.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా మహమ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీమిండియా ద్వారా డబ్బులు సంపాదించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు లండన్ లో సెటిల్ అయ్యాడని మండిపడ్డారు. టెస్టులు ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించి, టీమిండియా కొంపముంచాడని నిప్పులు చెరిగారు. విరాట్ కోహ్లీ కంటే ఏజ్ పై బడిన వాళ్లు కూడా ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడుతూ.. రికార్డులు సృష్టిస్తున్నారని వివరించారు. మంచి ఫిట్నెస్ ఉన్నా కూడా లైట్ గా గడిపేందుకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడని మహమ్మద్ కైఫ్ మండిపడ్డారు.
ఇలాంటి వాళ్లను టీమిండియా ఇన్ని రోజులు భరించడం శుద్ధ దండగ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చేశారు. టీమిండియా ద్వారా డబ్బులు సాధించి, అలాగే ఫేమస్ అయిన వాళ్లు జట్టు కోసం పనిచేయకుండా వ్యవహరించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించారు. ఇప్పటికైనా టెస్టు ఫార్మాట్ లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలని విరాట్ కోహ్లీని కోరారు. మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీలో టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని వ్యాఖ్యానించారు.