BigTV English
Advertisement

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !

Mohammed Shami: దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్ పైనే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఫైనల్ పోరుకు మరికొన్ని గంటలలో తేరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది భారత జట్టు.


Also Read: Hardik Pandya-Natasa: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్‌.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?

మరోవైపు న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టి కరిపించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రీడాభిమానులను కలవరపెడుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు భారత్ – న్యూజిలాండ్ జట్లు రెండుసార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2000, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.


ఇక ప్రస్తుతం ఈ టైటిల్ పోరు కోసం ఇరుజట్లు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు స్పిన్నర్లను నెట్స్ లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 కి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా టాస్ ఓడిపోయింది. ఈ ఫైనల్ లో అయినా టాస్ గెలుస్తుందా..? లేదా అన్నది చూడాలి.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలవాల్సిన అవసరం లేదని అన్నాడు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. న్యూజిలాండ్ కే ఏది ఎంచుకోవాలో వదిలేయాలని.. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ మొదట బ్యాటింగ్ చేసినా, మొదట బౌలింగ్ చేసిన విజయం సాధించిందని.. అందుకే టాస్ గెలుపు పరిగణలోకి రాదని అన్నాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవాలని ఇండియాలోని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ {Mohammed Shami} బంధువులు ఈ ఫైనల్ పోరులో భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

 

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉన్న మహమ్మద్ షమీ బంధువులు భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో మహమ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం ప్లస్ పాయింట్. ఒంటి చేత్తో విజయాలు సాధించగల సత్తా కోహ్లీ సొంతం. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 45 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డుని బద్దలు కొడతాడు.

Tags

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×