BigTV English

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !

Mohammed Shami: దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్ పైనే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఫైనల్ పోరుకు మరికొన్ని గంటలలో తేరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది భారత జట్టు.


Also Read: Hardik Pandya-Natasa: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్‌.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?

మరోవైపు న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టి కరిపించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రీడాభిమానులను కలవరపెడుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు భారత్ – న్యూజిలాండ్ జట్లు రెండుసార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2000, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.


ఇక ప్రస్తుతం ఈ టైటిల్ పోరు కోసం ఇరుజట్లు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు స్పిన్నర్లను నెట్స్ లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 కి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా టాస్ ఓడిపోయింది. ఈ ఫైనల్ లో అయినా టాస్ గెలుస్తుందా..? లేదా అన్నది చూడాలి.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలవాల్సిన అవసరం లేదని అన్నాడు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. న్యూజిలాండ్ కే ఏది ఎంచుకోవాలో వదిలేయాలని.. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ మొదట బ్యాటింగ్ చేసినా, మొదట బౌలింగ్ చేసిన విజయం సాధించిందని.. అందుకే టాస్ గెలుపు పరిగణలోకి రాదని అన్నాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవాలని ఇండియాలోని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ {Mohammed Shami} బంధువులు ఈ ఫైనల్ పోరులో భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

 

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉన్న మహమ్మద్ షమీ బంధువులు భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో మహమ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం ప్లస్ పాయింట్. ఒంటి చేత్తో విజయాలు సాధించగల సత్తా కోహ్లీ సొంతం. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 45 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డుని బద్దలు కొడతాడు.

Tags

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×