Team India: ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డేలకు జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకుంటాం. అలాగే థియేటర్స్ లోనూ జాతీయగీతం పాడాం. అంతేకాకుండా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ తదితర పెద్దపెద్ద టోర్నిలలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు చిన్నపిల్లలతో కలిసి గ్రౌండ్ లోకి వచ్చి గీతాలాపన { indian anthem} చేయడం మీరు చూసే ఉంటారు. ఇరుజట్ల ఆటగాళ్లు వరుసగా నిలబడి, వారి ముందు చిన్నపిల్లలు కూడా నిలబడి ఎవరి దేశానికి చెందిన జాతీయ గీతాన్ని వారు ఆలపిస్తారు.
Also Read: Champions Trophy 2025: రహస్యంగా పాకిస్థాన్ వెళ్లిన పాండ్యా.. అఫ్రిదితో ఫోటోలు ?
ముందుగా ప్రత్యర్థి దేశ జాతీయ గీతం ఆలపించిన తరువాత భారత జాతీయ గీతం { indian anthem} జనగణమనను ఆలపిస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయా జట్లు వారి జాతీయ గీతాన్ని పాడడం ఆనవాయితీ. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వాళ్లు కూడా లేచి నిలబడి ఆటగాళ్లతో పాటు జాతీయ గీతాన్ని { indian anthem} ఆలపిస్తారు. ఈ ఆనవాయితీ మొదట ఫుడ్ బాల్ తో ప్రారంభమైంది. ఇది ఐరిష్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ ద్వారా మొదటిసారిగా ప్రారంభించారు.
అనంతరం ఇతర క్రీడలు కూడా ఈ ఆనవాయితీని స్వీకరించాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించేందుకు కోచ్ లు, ఆటగాళ్లు అందరూ మైదానంలోకి రావడం జరుగుతుంది. అయితే టీమిండియా {team india}లో జాతీయ గీతాన్ని { indian anthem} ఆలపించని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే.. తాజాగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్ {India vs England 5 T-20 Series} ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ సిరీస్ లోని మొదటి టి-20 కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు జాతీయగీతాల కోసం మైదానంలోకి అడుగుపెట్టాయి. ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి తప్పకుండా రావాల్సిందే. కానీ కోచింగ్ సిబ్బంది డగౌట్ లోనే ఉన్నారు. దీంతో టీమ్ ఇండియాలో ఇప్పుడు భారత జాతీయ గీతం పాడని ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
Also Read: Noman Ali – Hat-trick: పాక్ స్పిన్నర్ నౌమాన్ అలీకి హైట్రిక్.. చరిత్రలోనే తొలి ప్లేయర్ గా !
వారిలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ {morne morkel}, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దేశ్ కేట్ { ryan ten }ఉన్నారు. ఈ ఇద్దరు జాతీయ గీతాన్ని ఆలపించేందుకు మైదానంలోకి రాలేదు. నిజానికి ఈ ఇద్దరూ విదేశీయులే. వారు భారత దేశ జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు నిలబడతారు మాత్రమే. కానీ జాతీయగీతం పాడరు. నెదర్లాండ్ కి చెందిన ర్యాన్ టెన్ డెష్ కెట్ { ryan ten } గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్ అయిన తరువాత జట్టులో చేరాడు. ఇక మోర్కెల్ {morne morkel} దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్. ఇతడు ఐపిఎల్ లో గౌతమ్ గంభీర్ తో కలిసి పనిచేశాడు.