BigTV English

IPL 2024 Records: ఐపీఎల్.. ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు!

IPL 2024 Records: ఐపీఎల్.. ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు!

Indian Premier League 2024 Records: ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబయి వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ 200 వికెట్లు తీసుకున్న తొలి ఐపీఎల్ క్రికెటర్ అయ్యాడు. తర్వాత రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ సెంచరీతో తన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది.


23 ఏళ్ల వయసులో రెండు సెంచరీలు చేసిన ఐపీఎల్ తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఒక రికార్డ్ నమోదు చేసింది. అదేమిటంటే 8 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు నెగ్గిన ఐదో జట్టుగా నిలిచింది. అంతకు ముందు ముంబయి (201), పంజాబ్ (2014), చెన్నయ్ (2019), గుజరాత్ (2022) ఉన్నాయి.

వ్యక్తిగత రికార్డులు, జట్టు పరంగా రికార్డులు బాగానే నమోదవుతున్నాయి. కానీ ఎంతవరకు తమ రికార్డులతో జట్టు విజయానికి ఉపయోగపడుతున్నారనే అంశంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజున యశస్వి సెంచరీ చేశాడు. రాజస్థాన్ గెలిచింది. మొన్న జాస్ బట్లర్ కోల్ కతాపై సెంచరీ చేశాడు. రాజస్థాన్ గెలిచింది.


Also Read: Mobile Offer : ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్!

అంతకుముందు రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ముంబయి ఓడిపోయింది. అలాగే విరాట్ కొహ్లీ కూడా సెంచరీ చేశాడు. అయినా ఆర్సీబీ ఓడిపోయింది. లోపం ఎక్కడుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక్కరు సెంచరీలు చేయడం వల్ల మ్యాచ్ లు గెలవరు, ఇది 11 మంది ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడితేనే గెలుస్తుంది? అనే సంగతి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సెంచరీ చేయగానే ఆటగాళ్లను ఆకాశానికెత్తేస్తున్నారు. మిగిలిన ఆటగాళ్లు ఎంత గొప్పగా సపోర్టు చేసినా, బౌలర్లు తమ కర్తవ్యాన్ని నిర్వహించినా వారిని పట్టించుకోవడం లేదు. ఇది దారుణమని అంటున్నారు.

Also Read: Xiaomi 14 Civi : షియోమీ నుంచి కొత్త స్మార్ట్ ‌ఫోన్.. ధర ఎంతంటే?

ఈ రికార్డులపై కూడా సమగ్ర పరిశీలన జరగాలనే వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఎవరో ఒక్కరిని హీరోను చేసే సంస్కృతి పోవాలని అంటున్నారు. ఎందుకంటే సెంచరీల కోసం జట్టు అవసరాలను కొందరు పట్టించుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి.

జట్టు కోసం, జట్టు అవసరాల రీత్యా ఆడాలి తప్ప, వ్యక్తిగత రికార్డులు ఏ మాత్రం కరెక్టు కాదని కొందరంటున్నారు. ఈ అంశంపై తాను పోరాడుతున్నట్టు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాక్యానించడాన్ని నెట్టింట పలువురు కోట్ చేస్తున్నారు.ఇప్పటికైనా సెంచరీ హీరోలపై ఫోకస్ తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Related News

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

Big Stories

×